MLC : తెలంగాణ శాసనమండలిలో ఐదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రమి రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు.

MLC : తెలంగాణ శాసనమండలిలో ఐదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Mlc

Telangana Legislative Council : తెలంగాణ శాసన మండలిలో ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు టీఆర్‌ఎస్‌ సభ్యులు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రమి రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత శాసన మండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ప్రమాణం చేయించారు.

రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే కోటాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ మాట ఇస్తే తప్పరన్నారు. హుజూరాబాద్‌ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.

Telangana:తెలంగాణలో రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికలు..పొలిటికల్ పార్టీల క్యాంపు రాజకీయాలు

గురువారం ఉదయం శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి జి.జగదీష్ రెడ్డి వెంట నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మిర్యాలగూడెం ఎమ్మెల్యే యన్.భాస్కర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఉన్నారు.