Thief: పోలీస్ ఇంట్లో దొంగతనం.. లేఖ రాసిపెట్టిన దొంగ.. ఫ్రెండ్ కోసమే!

మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో ఓ పోలీసు అధికారి ఇంట్లో తన స్నేహితుడి ప్రాణాలను కాపాడటానికి దొంగతనం చేశాడు ఓ దొంగ.

Thief: పోలీస్ ఇంట్లో దొంగతనం.. లేఖ రాసిపెట్టిన దొంగ.. ఫ్రెండ్ కోసమే!

Robbery1

Thief Robs Policeman’s House: మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో ఓ పోలీసు అధికారి ఇంట్లో తన స్నేహితుడి ప్రాణాలను కాపాడటానికి దొంగతనం చేశాడు ఓ దొంగ. అంతేకాదు.. దొంగతనం చేసిన డబ్బును తిరిగి చెల్లిస్తానంటూ ఓ క్షమాపణ లేఖను కూడా రాసిపెట్టి వెళ్లాడు.

కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎఎస్‌ఐ) కమలేష్ కటారే ప్రకారం, ఛత్తీస్‌గర్‌లో పనిచేస్తున్న ఒక పోలీసు అధికారి ఇంట్లో దొంగతనం జరిగిందని, అతని కుటుంబంతో భింద్ నగరంలో ఉంటున్నట్లు వెల్లడించారు.

దొంగ క్షమాపణ లేఖ:
పోలీసుల చెబుతున్నదాని ప్రకారం, “క్షమించండి మిత్రమా, తప్పు అని తెలిసినా తప్పక చేస్తున్నాను.. నేను ఇలా చేయకపోతే, నా స్నేహితుడు ప్రాణాలు కోల్పోయేవాడు. మీరు బాధపడకండి, నాకు డబ్బు దొరికిన వెంటనే, నేను దానిని మీకు తిరిగి ఇచ్చేస్తాను.” అంటూ లేఖ రాసిపెట్టి వెళ్లాడు.

పోలీసు భార్య మరియు పిల్లలు జూన్ 30న బంధువుల ఇంటికి వెళ్లగా.. తిరిగి ఇంటికి వచ్చేవరకు గదుల తాళాలు పగిలిపోయి ఉన్నాయి. వారి వస్తువులు చెల్లాచెదురుగా అయిపోయి కనిపించాయి. దొంగ కొంత వెండి మరియు బంగారు ఆభరణాలను తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

అయితే, ఇంట్లో విషయాలు బాగా తెలిసిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.