Mumbai : ముంబైలో ట్రాఫిక్ రద్దీ వల్లే..దంపతులు విడాకులు తీసుకుంటున్నారు : మాజీ సీఎం భార్య వ్యాఖ్యలు

ముంబైలో ట్రాఫిక్ రద్దీ వల్లే దంపతులు విడాకులు తీసుకుంటున్నారు అని మహారాష్ట్రం మాజీ సీఎం ఫడ్నీవీస్ భార్య వ్యాఖ్యానించారు.

Mumbai : ముంబైలో ట్రాఫిక్ రద్దీ వల్లే..దంపతులు విడాకులు తీసుకుంటున్నారు : మాజీ సీఎం భార్య వ్యాఖ్యలు

Divorces In Mumbai Due To Traffic..amruta Fadnavis

divorces in Mumbai due to traffic.. Amruta Fadnavis : ముంబైలో దంపతులు విడాకులు తీసుకోవటానికి కారణం ట్రాఫిక్ రద్దీ వల్లే అని బీజేపీ నేత,మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. ముంబైలో రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోతున్నాయని..ట్రాఫిక్ జామ్ వల్లనే ముంబైలో మూడు శాతం దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నీవీస్ ప్రభుత్వంపై శుక్రవారం (ఫిబ్రవరి 4,2022)విమర్శలు చేశారు.ఈ సందర్భంగా ఆమె తన ట్రాఫిక్ విషయంలో తాను పడే స్వానుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ప్రమాణ సమయంలో రోడ్లపై గుంతల వల్ల విపరీతమైన గతుకులతో ఇబ్బందులు పడుతున్నాని చెప్పుకొచ్చారు.

‘‘నేను ఓ మాజీ సీఎం భార్యనే అయినా నేను కూడా సాధారణ పౌరురాలిగానే చెబుతున్నాను…బయటకు వెళ్లాలంటే ఈ గతుకుల రోడ్లపై ప్రయాణించాలిరా బాబూ అని భయపడుతున్నానని..కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళితే మాత్రం గతుకుల రోడ్లపై నానా పాట్లు పడుతున్నానని.. నేను బయటకు వెళ్లినప్పుడల్లా గోతులు, ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నానని చెప్పుకొచ్చారామె.

ఈ ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రజలు తమ కుటుంబాలకు తగినంత సమయం కేటాయించే అవకాశం ఉండడం లేదని..వాస్తవానికి చెప్పాలంటే..ముంబైలో మూడు శాతం విడాకులుట్రాఫిక్ రద్దీ వల్లనే జరుగుతున్నాయని అమృతా ఫడ్నీవీస్ అన్నారు.

కాగా మాజీ సీఎం ఫడ్నవీస్ భార్య అమృతాపై అధికార మహా వికాస్ అఘాడీ నాయకులు తరచూ విమర్శలు చేస్తుంటారు. దీంతో ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా అవకాశం చిక్కినప్పుడల్లా అధికార పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు.ఈక్రమంలో మరోసారి ఆమె ప్రభుత్వంపై విమర్శలుచేశారు.