Telangana BJP : కేసీఆర్‌పై రాజకీయ పోరుకు సిద్ధం కావాలి – తరుణ్ చుగ్

బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మురళీధర్ రావు, డీకే అరుణ, డా. లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతల అవినీతి పై చర్చించారు. కేసీఆర్‌పై రాజకీయ పోరుకు సన్నద్దం కావాలని తరుణ్ చుగ్ సూచించారు.

Telangana BJP : కేసీఆర్‌పై రాజకీయ పోరుకు సిద్ధం కావాలి – తరుణ్ చుగ్

T Bjp

TS BJP Incharge Tarun Chugh : బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మురళీధర్ రావు, డీకే అరుణ, డా. లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతల అవినీతి పై చర్చించారు. కేసీఆర్‌పై రాజకీయ పోరుకు సన్నద్దం కావాలని తరుణ్ చుగ్ సూచించారు. ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి..పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహం..కేసీఆర్ స్ట్రాటజీలను ఎదుర్కొనేందుకు అనురించాల్సిన విధానాలపై కీలకంగా చర్చించారు.

కేసీఆర్ ఎన్నికల వ్యూహాలపై ఎలా ప్రతి వ్యూహాలు రచించాలనే దానిపై పార్టీ నేతలతో తరుణ్ చుగ్ మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు చేరికల పైనా చర్చించారు. మాజీ మంత్రి ఈటల చేరికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. 13 లేదా 14న చేరుతారంటూ ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీలో ఈటలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ముఖ్యనాయకుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహలు రచించాలని పార్టీ నిర్ణయించింది.

Read More ; Andhra Pradesh : ఇసుక రీచ్‌ల వేలం పేరిట భారీ మోసం