Veera Simha Reddy: వీరసింహారెడ్డి లాస్ట్ సాంగ్.. ఇక్కడే కానిస్తారట!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోలు, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
![Veera Simha Reddy: వీరసింహారెడ్డి లాస్ట్ సాంగ్.. ఇక్కడే కానిస్తారట! Veera Simha Reddy: వీరసింహారెడ్డి లాస్ట్ సాంగ్.. ఇక్కడే కానిస్తారట!](https://10tv.in/wp-content/uploads/2022/12/Veera-Simha-Reddy-Last-Song-To-Be-Shot-In-Hyderabad.jpg)
Veera Simha Reddy Last Song To Be Shot In Hyderabad
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోలు, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
Veera Simha Reddy: ఆ విషయంలో ‘అఖండ’కు రీసౌండ్ ఇవ్వనున్న వీరసింహారెడ్డి
టైటిల్ సాంగ్ ‘జై బాలయ్య’, రెండో సింగిల్ సాంగ్ ‘సుగుణ సుందరి’లకు మంచి ప్రేక్షకాదరణ దక్కడంతో, ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ సాంగ్ షూటింగ్ గురించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని లాస్ట్ సాంగ్ షూటింగ్ను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. బాలయ్య-శ్రుతి హాసన్లపై ఈ సాంగ్ షూట్ చేయనున్నారు. డిసెంబర్ 21 నుంచి ఈ పాట షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
Veera Simha Reddy: ఈసారి రొమాంటిక్గా వస్తున్న బాలయ్య.. రెండో సింగిల్ సాంగ్కు టైమ్ ఫిక్స్!
ఇక ఈ సాంగ్కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అని బాలయ్య అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ మూవీ సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.