Veera Simha Reddy : ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికని మార్చుకోనున్న వీరసింహారెడ్డి..

నందమూరి నటసింహం నటిస్తున్న ఫ్యాక్షన్ డ్రామా చిత్రం 'వీరసింహారెడ్డి'. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఇక చిత్ర యూనిట్ ఈ నెల 6న ఒంగోలులో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మూవీ టీంకి గట్టి షాక్ ఇచ్చింది.

Veera Simha Reddy : ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికని మార్చుకోనున్న వీరసింహారెడ్డి..

Veera Simha Reddy pre release event change

Veera Simha Reddy : నందమూరి నటసింహం నటిస్తున్న ఫ్యాక్షన్ డ్రామా చిత్రం ‘వీరసింహారెడ్డి’. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్, టీజర్ అండ్ సాంగ్స్ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక చిత్ర యూనిట్ ఈ నెల 6న ఒంగోలులో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది.

Veera Simha Reddy: చెన్నకేశవరెడ్డి ఎపిసోడ్‌ను దించేస్తున్న వీరసింహారెడ్డి.. ఫ్యాన్స్ రెడీగా ఉండాలట!

అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మూవీ టీంకి గట్టి షాక్ ఇచ్చింది. ఒంగోలులోని ఎబిఎం కాలేజీ గ్రౌండ్స్ లో ఈవెంట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత పోలీసులు అనుమతి నిరాకరించడంతో అయోమయంలో పడ్డారు ఈవెంట్ ఆర్గనైజర్లు. ఈవెంట్ ప్లేస్ నగరం మధ్యలో ఉండడం, అభిమానులు కూడా అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో వస్తున్నారు అని తెలియడంతో భద్రతా దృష్టిలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

దీంతో చిత్ర యూనిట్ ఒంగోలులోని బిఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రాంగణాన్ని పరిశీలించింది. పోలీసులు కూడా అక్కడ ఈవెంట్ నిర్వహించుకోడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈవెంట్ ని అక్కడ నిర్వహిస్తారా? లేదా హైదరాబాద్ కి మారుస్తారా? అనేది ఈరోజు క్లారిటీ రానుంది. కాగా ఈ మూవీ ట్రైలర్ ని కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా శృతిహాసన్, హనీ రోజ్ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.