Vinod Kumar : మణిపూర్ అల్లర్లపై ప్రధాని స్పందించి.. ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించాలి : వినోద్ కుమార్

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.

Vinod Kumar : మణిపూర్ అల్లర్లపై ప్రధాని స్పందించి.. ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించాలి : వినోద్ కుమార్

Vinod Kumar

Updated On : June 24, 2023 / 9:53 PM IST

Manipur Riots : మణిపూర్ లో గత కొంతకాలంగా అలర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ స్పందించాలని.. ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మణిపూర్ ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉందని అఖిలపక్ష సమావేశంలో చెప్పామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తాము ఢిల్లీలో ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల రాజకీయ పార్టీలు, సంఘాలు మమ్మల్ని కలిసే వారని.. ఈ అంశంపై తమకు కొంత అవగాహన ఉందన్నారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. మణిపూర్ లో కుకి, నాగాలు కొండ ప్రాంతాల్లో నివాసిస్తారు.. వారు 40% ఉంటారు… వారు క్రిస్టియన్స్ మైనారిటీలు అని పేర్కొన్నారు. మైదాన ప్రాంతంలో మెయితెయిలు నివసిస్తారని.. దాదాపుగా వారు 50% మంది ఉంటారు… వీళ్ళు హిందువులు అని తెలిపారు. కారణాలు తెలియనప్పటికీ 1990 నుంచి ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు.

Jairam Ramesh : మణిపూర్ హింసపై కేంద్ర అఖిలపక్ష సమావేశం కంటితుడుపు చర్య : జైరాం రమేష్

‘కుకిలు, నాగాలు ఉన్న చోట మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలని మెయితెయిలు డిమాండ్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే ఎవరినైనా ఎస్టీల్లో చేర్చాలంటే ఆ హక్కు పార్లమెంట్ కు మాత్రమే ఉంటుందని వెల్లడించారు. కానీ, మణిపూర్ హైకోర్టు 4 వారాల్లో మెయితెయిలను ఎస్టీల్లో చేర్చాలని తీర్పు ఇచ్చిందని.. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు… ఒకవేళ స్టే ఇచ్చి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగపోయి ఉండేవని సమాచారమని పేర్కొన్నారు.  నాలుగు వేల ఆయుధాలు మెయితెయిలు ఎత్తుకెళ్లారని వెల్లడించారు.

కేంద్ర బలగాలు మోహరించారని చెబుతున్నారు… కావున ఆయుధాలను డిజల్వ్ చేయాలని తెలిపారు. మణిపూర్ లో ప్రస్తుతం వర్షాకాలం వస్తోందని, రెండు నెలలు విపరీతమైన వర్షాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఘర్షణల కారణంగా అనేక ఇళ్ళు ధ్వంసం అయ్యాయని, వేలాది మంది నిర్వాసితులయ్యారని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. 50 రోజులు ఇంటర్నెట్ నిషేధించడం మంచిది కాదని చెప్పామని తెలిపారు.

Madhu Yashki Goud : కాంగ్రెస్ లో చేరేవారి విషయంలో ఆంధ్ర నేతలంటున్నారు.. కేసీఆర్ పార్టీలో లేరా? మధు యాష్కీ గౌడ్

విద్యార్థులు, యువత, ఇతర సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరణ చేయాలని కోరినట్లు తెలిపారు. ఇంత జరిగినా ఇప్పటివరకు ప్రధాని స్పందించలేదని.. ఇది మంచి పద్ధతి కాదని చెప్పామని పేర్కొన్నారు. 13 ఏళ్ల క్రితం కాశ్మీర్ లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆనాడు హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు అన్ని పార్టీలను తీసుకెళ్లారని పేర్కొన్నారు. నేటి సమావేశంలో తాము చేసిన సూచనలు, సలహాలను స్వీకరిస్తామని చెప్పారని తెలిపారు.