Delhi Government : ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు : సీఎం కేజ్రీవాల్

సుప్రీంకోర్టు తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజస్వామ్యమే గెలిచిందని..సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఢిల్లీలో అభివద్ధి మరింత వేగంగా జరుగుతుందని అన్నారు.

Delhi Government : ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు : సీఎం కేజ్రీవాల్

CM Kejriwal

Delhi Government: సుప్రీంకోర్టు తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజస్వామ్యమే గెలిచిందని..సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఢిల్లీలో అభివద్ధి మరింత వేగంగా జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యం గెలిచేలా ఇలాంటి తీర్పునిచ్చిందుకు జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్ లోని న్యామూర్తులందరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

కాగా..దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారం అని..దీంట్లో కేంద్ర జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో పరిపాలనా సేవలను ఎవరు నియంత్రించాలనే అంశంపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రజాస్వామ్యబద్గంగా ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అవసరమని..సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి శాసన, కార్యనిర్వాహక అధికారులు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు, పబ్లిక్ ఆర్డర్స్, ల్యాండ్ మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.

Delhi Government: కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

ఢిల్లీలోని శాసనసభ, ప్రభుత్వం పనితీరుకోసం ఒక ఫ్రేమ్ వర్క్‌ను అందించడానికి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్‌సీటీడీ) చట్టం 1991 అమల్లోఉంది. అయితే, ఢిల్లీలోని అన్ని పాలనా సర్వీసుల పై కేంద్రానికే నియంత్రణ ఉంటుందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్ కు అదనపు అధికారాలు ఇచ్చారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎల్జీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సానుకూల ఫలితం రాకపోవటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2019 ఫిబ్రవరి 14న సుప్రింకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ వివాదంపై భిన్నమైన తీర్పులు ఇచ్చింది. అనంతరం ఈ అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి పంపారు. ఢిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా, ఆ రాష్ట్ర ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సీఫార్సు చేస్తున్నట్లు గత ఏడాది మే 6న సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం గురువారం తీర్పు వెలురించింది.

Uddhav Thackeray: ఉద్దవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం.. సుప్రింకోర్టులో ఉద్దవ్ వర్గానికి దక్కని ఊరట