West Bengal : అసెంబ్లీలో డిష్యూం.. డిష్యూం, బీజేపీ సభ్యుడికి తీవ్రగాయాలు!

బీర్ భూం జిల్లాలో 8 మంది సజీవ దహనం అవ్వడంపై చర్చించాలని బీజేపీ పట్టుబట్టింది. దీంతో టీఎంసీ, బీజేపీ సభ్యుల మధ్య మాటలు తూటాలు పేలాయి. అసలు ఈ ఘటనకు కారణం బీజేపీ అంటూ టీఎంసీ...

West Bengal : అసెంబ్లీలో డిష్యూం.. డిష్యూం, బీజేపీ సభ్యుడికి తీవ్రగాయాలు!

West Bengal

West Bengal Assembly : శాసనసభ.. ప్రజా సమస్యలు చర్చించడానికి, వాటి పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు చర్చిస్తుంటారు. అంతేగాకుండా ప్రజల మేలు కోసం చట్టాలను రూపొందిస్తుంటారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలో జరిగేదే. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన కూడా చేస్తుంటారు. అదే పనిగా ఆందోళన చేస్తున్న సభ్యులను మార్షల్ సహయంతో వారిని బయటకు పంపిస్తుంటారు. కానీ.. వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఒక రెజ్లింగ్ రింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు కొట్టుకున్నారు. దూషించుకున్నారు. దీంతో సమావేశాలను చూస్తున్న ప్రజలు నోరెళ్లబెట్టారు. వీళ్లు ప్రజా ప్రతినిధులేనా అంటూ అవాక్కయ్యారు.

Read More : Birbhum : బీర్ భూం ఘటనలో సంచలన విషయాలు, సజీవదహనం కంటే ముందు కొట్టారు ?

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2022, మార్చి 28వ తేదీ సోమవారం జరిగిన సమావేశాల్లో బీర్ భూం జిల్లాలో 8 మంది సజీవ దహనం అవ్వడంపై చర్చించాలని బీజేపీ పట్టుబట్టింది. దీంతో టీఎంసీ, బీజేపీ సభ్యుల మధ్య మాటలు తూటాలు పేలాయి. అసలు ఈ ఘటనకు కారణం బీజేపీ అంటూ టీఎంసీ ఆరోపించింది. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీలకు చెందిన సభ్యుల బాహాబాహికి దిగారు. బీజేపీ ఎమ్మెల్యే మంజుదర్ తీవ్రంగా గాయపడ్డారు. టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేయడంతో ఆయన గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీఎంసీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ ఘటనపై స్పీకర్ సీరియస్ అయ్యారు. సువేందుతో సహా.. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

Read More : Birbhum Incident : పార్లమెంట్‌‌లో కన్నీరు పెట్టిన ఎంపీ రూపా గంగూలీ

మరోవైపు..పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూం జిల్లాలో 8మంది సజీవ దహనం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరంగా చేపడుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 22 మంది అనుమానితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు తెలిపింది. రాష్ట్ర పోలీసులు సమర్పించిన జాబితాలోనూ ఇంతమంది పేర్లే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేయగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఈ హత్యలను దుండగులు ప్రతీకారంతోనే జరిపినట్లు సీబీఐ వెల్లడించింది. వ్యక్తులను చంపాలనే ఉద్దేశంతోనే బాధితులను ఇళ్లలో ఉంచి నిప్పు పెట్టినట్లు సీబీఐ ఎఫ్‌ఆర్‌ నమోదు చేసింది.
అటు బీర్ భూంలో హింసాత్మక ఘటనపై సీబీఐ నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు సీఎం మమతా బెనర్జీ. విచారణను ప్రభావితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనేందుకు నిరసనకు సిద్ధమని అన్నారు. ఈ ఘటఈ న వెనుక ఏదో కుట్ర ఉన్నదని ఆమె ఆరోపించారు. కేసు దర్యాప్తును సీబీఐకి హైకోర్టు అప్పగించడం మంచి నిర్ణయమేనని చెప్పారు. అయితే బీజేపీ డైరెక్షన్‌ను సీబీఐ అనుసరిస్తే, దీనిపై నిరసన తెలిపేందుకు సిద్ధమేనని మమత హెచ్చరించారు.