T.Congress : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ?
హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బైపోల్ నోటిఫికేషన్ వచ్చినా.. అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదు.
Congress Candidate Huzurabad? : హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బైపోల్ నోటిఫికేషన్ వచ్చినా.. అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదు. అభ్యర్థి ఎంపిక ఇంకా పూర్తి కాకపోవడం ఒక ఎత్తయితే… ప్రచార పర్వం మరెప్పుడు స్టార్ట్ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. హుజూరాబాద్ బరిలో నిలిచే అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కసరత్తు చేస్తోంది హస్తం పార్టీ. సీనియర్ నేత దామోదర రాజనర్సింహ కమిటీ.. ముగ్గురి పేర్లను సూచించింది.
Read More : Huzurabad By Election : ఈటలకు చావోరేవో..బీజేపీ గెలుస్తుందా ?
వీరిలో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎంపీపీ సదానందం, కిసాన్ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి ఉన్నారు. జిల్లాకు చెందిన నేతలు లోకల్ లీడర్ అయితే బాగుటుందని సూచించడంతో.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహతో మరో కమిటీని వేశారు. ఈ కమిటీ కూడా ముగ్గురు పేర్లను సూచిస్తూ ఒక నివేదిక ఇచ్చింది. సీఎల్పీ నేత భట్టి, దామోదర రాజనర్సింహలు తాజాగా పూర్తిగా లోకల్ లీడర్ల పేర్లనే ప్రస్తావిస్తూ పార్టీ హైకమాండ్కు నివేదిక ఇచ్చారు.
Read More : Huzurabad : నామినేషన్ వేయనున్న గెల్లు శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం కేసీఆర్
వీరిలో స్థానిక నేత రవికుమార్, కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సైదులు పేర్లున్నాయి. అయితే వీరిలో యువజన విభాగానికి చెందిన రవికుమార్ను.. అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. హుజూరాబాద్ కాంగ్రెస్ క్యాండిడెట్ విషయంలో క్లారిటీ వచ్చిందంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుండటంతో.. అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు హస్తం పార్టీ నేతలు.