Veera Simha Reddy : హనీ రోజ్‍తో సిప్ వేస్తున్న బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటో!

నందమూరి నటసింహ బాలకృష్ణ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో నిన్న సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్ పూర్తి అయ్యాక బాలయ్య..

Veera Simha Reddy : హనీ రోజ్‍తో సిప్ వేస్తున్న బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటో!

Veera Simha Reddy

Veera Simha Reddy : నందమూరి నటసింహ బాలకృష్ణ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా ‘వీరసింహారెడ్డి’. దీంతో వింటేజ్ బాలయ్యని చూసేందుకు అభిమానులు థియేటర్లకు ఎగపడ్డారు. అంతేకాదు తమ అభిమాన హీరోకి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ని హిట్టుని అందించారు. కాగా నిన్న చిత్ర యూనిట్ ‘వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్’ అంటూ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ ముఖ్య అథిలుగా హాజయ్యారు.

Balakrishna : మాఘమాసం లగ్గం పెట్టిస్తా.. మరోసారి గొంతు సవరించిన బాలయ్య!

ఇక ఈ సక్సెస్ మీట్ పూర్తి అయ్యాక బాలయ్య.. విశ్వక్ సేన్, హీరోయిన్ హనీ రోజ్ తో కలిసి స్పెషల్ పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకి రాగా.. అందులోని ఒక ఫోటో అందర్నీ ఆకర్షిస్తుంది. ఆ ఫొటోలో బాలకృష్ణ, హనీ రోజ్ తో కలిసి స్టైల్ గా సిప్ వేస్తున్న సీన్ కనిపిస్తుంది. ఈ ఫోటో అందరికి కిక్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన అఖండ లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం ఎనిమిది రోజులోనే దాటేసింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు దాదాపు రూ.110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ చిత్రం సుమారు రూ.70 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ అయ్యినట్లు సమాచారం. అయితే దీని పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సొంత డిస్ట్రిబ్యూషన్ తో రిలీజ్ చేయడంతో నిర్మాతలు భారీ లాభాలను చూసే అవకాశం ఉంది అంటున్నారు సినిమా పండితులు.