Drishyam Movie Part 3 : దృశ్యం సినిమాకి మరో సీక్వెల్.. పార్ట్ 3 ప్రకటించిన నిర్మాత.. వెయిటింగ్ అంటున్న ప్రేక్షకులు..
థ్రిల్లర్ జోనర్ లో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన సినిమా దృశ్యం. ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టుతో భారీ విజయం సాధించి ఆ తర్వాత.........
Drishyam Movie Part 3 : హిట్టయిన సినిమాకి సీక్వెల్ అంటే చాలా జాగ్రత్తగా తీయాల్సిందే. సీక్వెల్ సినిమాలపై చాలా అంచనాలు ఉంటాయి. చాలా వరకు సీక్వెల్ సినిమాలు పరాజయాన్ని చూస్తాయి. కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల అంచనాలు అందుకొని హిట్ అవుతాయి. అలాంటి అతి తక్కువ సినిమాల్లో దృశ్యం సినిమా ఒకటి. థ్రిల్లర్ జోనర్ లో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన సినిమా దృశ్యం. ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టుతో భారీ విజయం సాధించి ఆ తర్వాత తమిళ్, తెలుగు, హిందీ.. చాలా భాషల్లో రీమేక్ అయింది. రీమేక్ అయిన ప్రతి చోట కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత దీనికి సీక్వెల్ గా దృశ్యం 2 కూడా తీశారు. ఈ సినిమా దృశ్యం కంటే కూడా మరింత థ్రిల్లింగ్ గా ఉండి దానికంటే మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా తర్వాత అన్ని భాషల్లోకి రీమేక్ అయి హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాలో ఒక కంక్లూజన్ ఉండటంతో కథ అక్కడికి ముగిసిపోయిందని ప్రేక్షకులు భావిస్తారు. కానీ కొన్ని రోజుల నుంచి దీనికి మరో సీక్వెల్ కూడా ఉందని వార్తలు వినిపిస్తుండగా తాజాగా దృశ్యం సినిమా నిర్మాత ఓ అవార్డు ఫంక్షన్లో దృశ్యం 3 ఉంటుందని ప్రకటించాడు.
సూపర్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ దృశ్యం సినిమాకి మరో సీక్వెల్ ప్రకటించడంతో, ఇది కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే తెరకెక్కనుండటంతో సినీ ప్రేమికులు, అభిమానులు ఈ పార్ట్ 3 కోసం వైట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్కి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సారి ఇంకెన్ని ట్విస్టులతో డైరెక్టర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాడో చూడాలి.
#Drishyam3 CONFIRMED by Producer Antony Perumbavoor in the Mazhavil Entertainment Awards.#Mohanlal
— Manobala Vijayabalan (@ManobalaV) August 27, 2022