Bollywood Actress Divorce : భారీగా భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న బాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే!
చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు ఆ తర్వాత విడిపోవడాలు సాధారణ విషయమే. ప్రేమ పెళ్లి చేసుకున్న చాలా జంటలు కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మంచిగా ఉన్నంత కాలం జీవితం సాఫీగా ఉంటుంది.. ఏదైనా తేడా వస్తే రిలేషన్ షిప్ దెబ్బ తింటుంది.. ఇలా మనస్పర్థలు వచ్చి విడిపోయిన జంటలు, విడిపోయే ముందు చెల్లించిన భరణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
Bollywood Actress Divorce : చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు ఆ తర్వాత విడిపోవడాలు సాధారణ విషయమే. ప్రేమ పెళ్లి చేసుకున్న చాలా జంటలు కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మంచిగా ఉన్నంత కాలం జీవితం సాఫీగా ఉంటుంది.. ఏదైనా తేడా వస్తే రిలేషన్ షిప్ దెబ్బ తింటుంది.. ఇలా మనస్పర్థలు వచ్చి విడిపోయిన జంటలు, విడిపోయే ముందు చెల్లించిన భరణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హృతిక్ రోషన్ – సుసాన్ ఖాన్
హృతిక్ రోషన్, సుసాన్ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు పదేళ్ళపాటు కలిసి ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఏమైందో తెలియదు వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ మనస్పర్థలకు కారణం కంగనానే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో రూ.400 కోట్లు భరణంగా చెల్లించాలని సుసాన్ ఖాన్ డిమాండ్ చేశారు. అయితే హృతిక్ రోషన్ రూ.380 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇక సుసాన్ ఖాన్ తో విడాకులు తీసుకున్న తర్వాత హృతిక్ ఒంటరిగానే ఉంటున్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకోనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
అమీర్ ఖాన్ – రీనా దత్తా
అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. అయినా ఈ జంట 16 సంవత్సరాలు కలిసి ఉన్నారు.. 2002లో విడిపోయారు. వీరికి ఓ బాబు. ఓ పాప ఉన్నారు. అయితే రీనా దత్తాతో విడాకులు తీసుకున్న సమయంలో అమీర్ ఖాన్ కోట్ల రూపాయలే భరణంగా ఇచ్చినట్లు ప్రచారం ఉంది. కానీ ఎంత మొత్తం అనేది మాత్రం ఇప్పటికీ రహస్యమే.
సైఫ్ అలీఖాన్ – అమృతా సింగ్
అమృతా సింగ్ను సైఫ్ అలీఖాన్ 1991లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ వీరి కూతురే. 13 ఏళ్ల కాపురం తర్వాత 2004లో సైఫ్ అలీఖాన్, అమృతకు విడాకులు ఇచ్చారు. ఇందు కోసం భరణంగా తన ఆస్తిలో సగభాగం అమృత పేర రాసిచ్చాడట. అయితే ఈ ఆస్తుల విలువ ఎంత అనేది మాత్రం తెలియదు. ఎనిమిదేళ్లు ఒంటరి జీవితం గడిపిన సైఫ్ 2012లో కరీనా కపూర్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.
సంజయ్ దత్ – రియా పిళ్లై
సంజయ్ దత్ లీవుడ్ నటి రిచా శర్మను 1987లో వివాహం చేసుకున్నారు.. వీరికి ఒక కూతురు.. రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ 1996 మృతి చెందారు. ఆ తర్వాత రెండేళ్లకు 1998లో సంజయ్ రియా పిళ్లైని వివాహం చేసుకున్నారు. 10 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం మనస్పర్థలు రావడంతో 2008లో విడిపోయారు. విడిపోయేటప్పుడు రియా ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కారు భరణంగా పొందిందట. రియా పిళ్లైతో విడాకుల అనంతరం 2008లో మాన్యతను పెళ్లి చేసుకున్నాడు సంజయ్. వీరికి ఇద్దరు పిల్లలు.
ప్రభుదేవా – రమాలత్
నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా విడాకులు 2011లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. నయనతారతో క్లోజ్ గా మూవ్ అవుతుండటంతో భార్య రమాలత్తో ప్రభుదేవాకు విభేదాలు వచ్చాయి. నయనతారను పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఈ దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 2011లో విడాకులు తీసుకున్నారు. ఇందుకోసం రూ.10 లక్షల నగదుతో పాటు ఖరీదైన రెండు కార్లు, దాదాపు రూ.25 కోట్లు విలువ చేసే ఆస్తులను ప్రభుదేవా భరణంగా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఆదిత్య చోప్రా – పాయల్ ఖన్నా
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం కారణంగా యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా తన మొదటి భార్య పాయల్ ఖన్నాకు విడాకులు ఇచ్చాడు. రాణీ ముఖర్జీతో ఆదిత్య ప్రేమ వ్యవహారం గురించి పాయల్కు తెలియడంతో వీరి దాంపత్యంలో గొడవలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే పాయల్ ఖన్నాకు రూ.100 కోట్ల వరకు భరణం చెల్లించినట్లు సమాచారం.