Salman Khan : మరోసారి సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. రెక్కీ చేసిన రౌడీషీటర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..
తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ హత్యకి నిందితులు కుట్ర చేసినట్టు తేలింది. పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాని హత్య చేసిన నిందితులే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేశారని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్.................
Salman Khan : పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యని జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చేయించాడని తేలింది. అయితే ఇదే గ్యాంగ్స్టర్ ఖాతాలో మరింతమంది సెలబ్రిటీలు ఉన్నట్టు తెలిసింది. గతంలోనే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ని హత్యచేస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సల్మాన్ కి భద్రతని కూడా ఇస్తున్నారు పోలీసులు. సల్మాన్ కూడా బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణిస్తున్నారు.
తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ హత్యకి నిందితులు కుట్ర చేసినట్టు తేలింది. పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాని హత్య చేసిన నిందితులే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేశారని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. సిద్దూ మూసేవాలా హత్యకేసు నిందితుల్లో ఒకడైన కపిల్ పండిట్ను డార్జిలింగ్లోని ఇండో-నేపాల్ సరిహద్దులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతన్ని విచారించగా సల్మాన్ ఇంటి వద్ద మూడు రోజులు రెక్కీ చేశామని, సల్మాన్ ని చంపడానికి ప్లాన్ వేశామని తెలిపినట్టు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు.
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జాబితాలో చాలా మంది ఉన్నారని, అతను జైలులో ఉండే వాళ్ళని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. సల్మాన్ ని చంపడానికి మరోసారి కుట్ర పన్నుతున్నారు అని తెలియడంతో సల్మాన్ కి పోలీసులు మరింత భద్రతని పెంచారు.