ఖుష్బూ మగాడిలా, సల్మాన్ రైతులా మారితే!.. తారలంతా హరితహారం చేపడితే..

  • Published By: sekhar ,Published On : July 22, 2020 / 07:04 PM IST
ఖుష్బూ మగాడిలా, సల్మాన్ రైతులా మారితే!.. తారలంతా హరితహారం చేపడితే..

ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్నారు. నచ్చిన విషయాలు నేర్చుకుంటున్నారు. కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు తమ యాక్టివిటీస్ అన్నిటినీ పిక్స్, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. Throwback పేరుతో పాత పిక్స్ షేర్ చేసి మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు. ఇక అప్‌డేట్స్ వంటివి సెలబ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కానీ తెలియడం లేదు. అలా ఎవరెవరు ఏం చేస్తున్నారో తాజాగా కొన్ని పోస్టులు చేశారు. ఆ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

https://www.instagram.com/p/CC54YUeF9SP/?utm_source=ig_web_copy_link

హాట్ బ్యూటీ శ్రియ శరణ్, గతంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి తీసుకున్న పిక్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. అమితాబ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన త్వరగా తిరిగి కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాక్‌డౌన్ రోజుల్ని తన ఫాంహౌస్‌లో గడుపుతున్నాడు. అక్కడ ఫుల్ టైమ్ రైతుగా మారి వ్యయసాయం చేస్తున్నాడు. పొలం దున్నడం, నాట్లు వేయడం.. ఇలా ప్రతీ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటన్నాడు.

https://www.instagram.com/p/CC3xc1zFFXO/?utm_source=ig_web_copy_link

సీనియర్ నటి ఖుష్బూ లాక్‌డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఆమె మగాడిలా మారితే ఎలా ఉంటారు అంటూ షేర్ చేసిన పిక్ ఆకట్టుకుంటోంది.

 

ఫిట్‌నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత మొక్కలు నాటారు.

Sushmita Konidela
‘జిల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణ చిన్నప్పుడు తండ్రితో కలిసి ఉన్న ఫోటోతో పాటు తన కొడుకుతో తను కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈయన ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ మాధురి దీక్షిత్ ఈ లాక్‌డౌన్ సమయంలో కొత్త విషయాలు నేర్చుకుందాం అంటూ ఆమె సముద్రంలో సాహసాలు చేస్తున్న పిక్స్ పోస్ట్ చేశారు.

 

టాలీవుడ్ యువ గాయకుడు హేమచంద్ర ‘తారా తారా తారా.. అదిగో కదిలే తారా’.. అంటూ తాను పాడిన తొలిపాట తాలూకు జ్ఞాపకాలను వీడియో ద్వారా షేర్ చేశారు.

https://www.instagram.com/p/CC5vh0DBhbj/?utm_source=ig_web_copy_link

తోటి హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి కేరళలోని తిరుచూరులో గల తన ఇంటి ఆవరణలో ఓ మొక్క నాటారు యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.
అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ కూడా మొక్కలు నాటి ‘ఉప్పెన’ మూవీ టీమ్‌కు ఛాలెంజ్ విసిరారు.
పాటల రచయిత శ్రీమణి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

https://www.instagram.com/p/CC6C5e5nG0G/?utm_source=ig_web_copy_link

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ తన చిన్ననాటి ఫోటో షేర్ చేయగా నెటిజన్ల నుండి మంచి స్పందన వస్తోంది.

https://www.instagram.com/p/CC5b8iZDI4x/?utm_source=ig_web_copy_link

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల ముద్దుల తనయ సితార జూలై 20 నాటికి 8 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మహేష్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కేక్ కట్ చేసి సితార పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నమ్రత షేర్ చేశారు.

https://www.instagram.com/p/CC5PEfkhLL0/?utm_source=ig_web_copy_link

ఇక ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండండి.. కాఫీని ఎంజాయ్ చేయండి అంటూ కాఫీ తాగుతున్న పిక్స్ షేర్ చేసింది.