వయ్యరాలు కాదు..మక్కెలు విరగ్గొడుతా కంగనా ఘాటు కామెంట్స్

వయ్యరాలు కాదు..మక్కెలు విరగ్గొడుతా కంగనా ఘాటు కామెంట్స్

kangana-ranaut-

Kangana Ranaut : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నేను రాజ్ పుత్ ని..వయ్యారాలు వొలికించను..కేవలం ఎముకలు విరగ్గొడుతా..అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదంతా..మాజీ మంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి సుఖ్ దేవ్ పన్సే మాట్లాడుతూ..కంగనా గురించి స్పందించారు. రికార్డింగ్ డ్యాన్సర్ అనే అర్థం వచ్చేలా..ఆమెపై కామెంట్స్ చేశారు.

సుఖ్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇంతకీ తనపై వ్యాఖ్యలు చేసిన ఈ వ్యక్తి ఎవరు ? అంటూ ప్రశ్నించారు. కత్రినా, దీపికా పదుకొణే, అలియా భట్ లాంటి హీరోయిన్స్ కాదని..ఇతనికి తెలుసా ? ఐటమ్ సాంగ్స్ చేయని ఒకే ఒక్క హీరోయిన్ అంటూ తేల్చిచెప్పారు. బడా హీరోల సినిమాలను సైతం తిరస్కరించిన..దీనివల్ల బాలీవుడ్ లో ఉన్న కొంతమంది నటీనటులు తనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

నేను ఒక రాజ్ పుత్ మహిళను..వయ్యారాలు వొలికించను..కేవలం ఎముకలు విరగ్గొడుతాను అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఇక కంగనా విషయానికి వస్తే..రజనీష్‌ ఘాయ్‌ దర్శకతంలో తెరకెక్కుతున్న ‘ధాకాడ్’‌ చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్‌1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ సినిమాలో కంగన ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కంగన రనౌత్‌ శుక్రవారం పూరీ జగన్నాథుని దర్శించుకున్నారు. శ్రీ మందిరం సింహద్వారం ఆవరణలో పతిత పావనుని దర్శించుకుని ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు.