Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??

రీసెంట్ గా పాన్ ఇండియా లెవల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు RRR, KGF2. ఈ రెండు సినిమాలు కూడా వసూళ్ల పరంగా................

Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??

Rrr Kgf

RRR-KGF :  రీసెంట్ గా పాన్ ఇండియా లెవల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు RRR, KGF2. ఈ రెండు సినిమాలు కూడా వసూళ్ల పరంగా 12 వందల కోట్లు క్రాస్ చేశాయి. వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూపంతా అటు కేజిఎఫ్ టీమ్, ఇటు ట్రిపుల్ ఆర్ టీమ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏ రేంజ్ సినిమా చేయబోతున్నారు? ఏ జానర్ లో సినిమా చేయబోతున్నారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ తర్వాత ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబో సెట్ అయింది. రాజమౌళి డైరెక్షన్లో మహేశ్ బాబు ఫస్ట్ టైమ్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలున్నాయి. ఆ మధ్య రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్లో అడ్వెంచర్ స్టోరీని మహేశ్ బాబు కోసం రెడీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న విజయేంద్ర ప్రసాద్ సెప్టెంబర్ కల్లా పూర్తవుతుందని క్లారిటీ ఇచ్చారు. తర్వాత దసరా రోజు పూజా కార్యక్రమాలతో మూహూర్తం షాట్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే హీరో కన్నా స్ట్రాంగ్ గా విలన్స్ ఉంటారు ఈ ప్రాజెక్ట్ లో కూడా మహేశ్ కి ప్రతినాయకుడి పాత్ర కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో, రాజమౌళి చర్చలు జరుపుతున్నారని సమాచారం.

ఇక కేజిఎఫ్ 2తో అఖండ విజయం సాధించిన ప్రశాంత్ నీల్ కూడా ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు.దాంతో పాన్ వరల్డ్ ఆడియన్స్ ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమాకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నారు. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో ఉంటుందని తారక్ బర్త్ డే రోజే ప్రకటించారు టీమ్. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే కేజిఎఫ్ 2ను మించి పోయేలా ఉంటుందనే హింట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా కథ కూడా తాను చిన్ననాటి నుంచే ఊహించుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పేసిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాలో తారక్ ఊరమాస్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్ కే కాదు, పాన్ ఇండియా ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేశారు.

Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..

ఇక కేజిఎఫ్ 2లో తన ఆటిట్యూడ్ తోనే ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన పాన్ ఇండియా స్టార్ రాఖీభాయ్ నెక్స్ట్ కన్నడ మఫ్టీ డైరెక్టర్ నార్తన్ తో యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన తారక్, చరణ్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ లే చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జులై నుంచి సెట్స్ మీదకెళ్లనున్నారు. రామ్ చరణ్ ఆల్రెడీ ఇండియన్ జీనియస్ కమర్శియల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో RC15 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటిన డైరెక్టర్స్, స్టార్స్ నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు కూడా ఇటు ఫ్యాన్స్ లో, అటు ఆడియన్స్ లో భారీ హోప్స్ క్రియేట్ చేస్తున్నాయి.