‘బిగ్‌బాస్’‌‌లో పార్టిసిపేట్ చేయట్లేదు..

  • Published By: sekhar ,Published On : July 22, 2020 / 02:00 PM IST
‘బిగ్‌బాస్’‌‌లో పార్టిసిపేట్ చేయట్లేదు..

‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 4కి సంబంధించిన అఫీషియల్ లోగోను శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోకి సంబంధించి ఈ సీజన్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలకు తెరదించుతూ.. ‘అతి త్వరలో..’ అంటూ ‘బిగ్‌బాస్’ సీజన్ 4 లోగో విడుదల ప్రోమోలో తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లు జూన్, జూలై నెలల్లోనే ప్రారంభం అయ్యాయి. కానీ ఈసారి ఈ షో కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. కరోనా ఎఫెక్ట్. అయితే ఈ సీజన్‌కు సంబంధించి కొందరు కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. అందులో హీరో తరుణ్ పేరు కూడా ఉంది. అయితే ‘బిగ్‌బాస్’లో తాను పాల్గొంటున్నట్లుగా వస్తున్న వార్తల్ని తరుణ్ ఖండించారు. తాజాగా ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

Tarun ‘‘హలో.. అందరికీ నమస్కారం. ఈ కష్టకాలంలో అందరూ జాగ్రత్తగా ఉన్నారని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో, అలాగే కొన్ని న్యూస్ పేపర్స్‌లో నేను ‘బిగ్‌బాస్’లో పాల్గొనబోతున్నట్లుగా వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు. ఈ సందర్భంగా అందరికీ నేను చెప్పేది ఏమిటంటే.. నేను ఈ షో‌లో చేయడం లేదు.. చేయాలనే ఆసక్తి కూడా నాకు లేదు. వస్తున్న వార్తలన్నీ పుకార్లే. దయచేసి వాటిని నమ్మవద్దు. అందరూ క్షేమంగా ఉండండి. ఇంటిపట్టునే ఉండి క్షేమంగా ఉండండి. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు.. మీ తరుణ్’’ అని హీరో తరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ప్రెస్‌నోట్‌‌లో పేర్కొన్నారు. అలాగే హీరోయిన్ యామిని భాస్కర్ కూడా ఈ షోలో పాల్గొనబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో తాను బిగ్‌బాస్ లో పార్టిసిపేట్ చేయడం లేదని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది యామిని.