Trivikram: త్రివిక్రమ్ ఆ స్టార్ ప్రొడ్యూసర్‌కు చుక్కలు చూపిస్తున్నాడా..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తాజాగా తమిళ హీరో విజయ్ నటించిన ‘వారిసు’ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు దిల్ రాజు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంతో టాలీవుడ్ నిర్మాతలతో దిల్ రాజుకు థియేటర్ల వివాదం ఏర్పడింది.

Trivikram: త్రివిక్రమ్ ఆ స్టార్ ప్రొడ్యూసర్‌కు చుక్కలు చూపిస్తున్నాడా..?

Trivikram Gives Shock To Producer Dil Raju

Trivikram: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తాజాగా తమిళ హీరో విజయ్ నటించిన ‘వారిసు’ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు దిల్ రాజు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంతో టాలీవుడ్ నిర్మాతలతో దిల్ రాజుకు థియేటర్ల వివాదం ఏర్పడింది. తెలుగు హీరోలకు ప్రాధాన్యతను ఇస్తూ, వారసుడు చిత్ర రిలీజ్‌ను వెనక్కి తీసుకొచ్చారు.

Trivikram: బాలీవుడ్ రాణిని పట్టుకొస్తున్న త్రివిక్రమ్.. నిజమేనా?

మొత్తానికి ఈ పండగకు వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈ స్టార్ ప్రొడ్యూసర్‌కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఊహించని షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ తెరకెక్కించే ప్రతి సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి SSMB28 ప్రాజెక్టును త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా నైజాం రైట్స్ దిల్ రాజుకు కాదని.. వేరొక డిస్ట్రిబ్యూటర్‌కు అప్పగించారట. ఏషియన్ ఫిల్మ్స్ ఈ సినిమా నైజాం రైట్స్‌ను దక్కించుకుందట.

Dil Raju : ఆ ముగ్గురి దర్శకులతో దిల్ రాజు పాన్ ఇండియా చిత్రాలు.. టైటిల్సే ఓ రేంజ్‌లో ఉన్నాయి..

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో వచ్చే సినిమాలను గతకొంత కాలంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజుకు ఇది షాక్ అనే చెప్పాలి. అయితే మహేష్ బాబు ఏషియన్ సునీల్‌తో బిజినెస్‌లో పార్ట్‌నర్‌గా మారడంతో, ఇప్పుడు ఈ సినిమా నైజాం రైట్స్‌ను ఆయనకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. కాగా, దిల్ రాజు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.