Anasuya : ఎన్నాళ్ళకి మెడలో అది కనిపించిందో.. మరోసారి అనసూయని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

మరోసారి అనసూయని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్లి కొన్ని పూజలు చేసింది. గోశాలని దర్శించింది. వీటికి సంబంధించిన ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనసూయ. అయితే వీటిల్లో..........

Anasuya : ఎన్నాళ్ళకి మెడలో అది కనిపించిందో.. మరోసారి అనసూయని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Trolling on Anasuya again on social media

Anasuya :  యాంకర్, నటి అనసూయ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఏదో ఒక ట్వీట్ చేసి, లేదా ఏదో ఒక కామెంట్ చేసి రచ్చ చేస్తుంది అనసూయ. నెటిజన్లు కూడా అనసూయని రెగ్యులర్ గా ట్రోల్ చేస్తూ ఉంటారు. అనసూయ నెటిజన్లకు ట్రోల్ చేసే ఛాన్స్ ఇస్తూ వస్తుంది. ఇటీవలే చాలా సిల్లీగా ఆంటీ అంటే పోలీసు కేసు పెడతా అని ట్వీట్ చేయడంతో చినికి చినికి గాలివాన అయినట్లు నెటిజన్లు అనసూయని దారుణంగా ట్రోల్ చేసి ఏకంగా ఆంటీ అనే పదాన్ని ఇండియా వైడ్ ట్రెండ్ చేశారు. అయినా అనసూయ తగ్గకుండా కౌంటర్లు వేసింది.

ఈ గొడవ అయిపొయింది అనుకునేలోపే మరోసారి అనసూయని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్లి కొన్ని పూజలు చేసింది. గోశాలని దర్శించింది. వీటికి సంబంధించిన ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనసూయ. అయితే వీటిల్లో అనసూయ తాళి వేసుకొని కనిపించింది. ఇంకేముంది నెటిజన్లు మరోసారి ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Anchor Anasuya : ట్రెండింగ్‌లో ‘ఆంటీ’.. పాపం అనసూయ.. దారుణంగా ఆడేసుకుంటున్న నెటిజన్లు..

అనసూయ పోస్ట్ చేసిన ఫోటోల కింద.. ఎన్నాళ్ళకి మెడలో తాళి వేసుకున్నావు, నీకు పెళ్లి అయిందని గుర్తుందా, నువ్వు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షూటింగ్స్ సమయంలో తాళి వేసుకోలేదంటే అనుకోవచ్చు, నువ్వు మాములు సమయాల్లో కూడా వేసుకోవు కదా, నీకు తాళి ఉందని చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టు ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే మళ్ళీ ఆంటీ, అంకుల్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. దీంతో మరోసారి అనసూయ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి ఈ సారి కామెంట్స్ కి ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.