Road Accident : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు నదిలో పడి 15 మంది మృతి

బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న బ్రిడ్జీ రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Road Accident : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు నదిలో పడి 15 మంది మృతి

Road Accident (1)

Road Accident : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడి పోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న బస్సు ఖార్గోన్ జిల్లాలో బ్రిడ్జీపై నుంచి నదిలో పడిపోయింది.

బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న బ్రిడ్జీ రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి.

Maharashtra Bus Accident: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం.. కాల్వలో పడటంతో 13 మంది మృతి

ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానికులు ఘటనాస్థలంలో వద్దసహాయక చర్యలు చేపట్టారు.