ఒకే ఫ్యామిలీలో 32 మందికి కరోనా పాజిటివ్

  • Published By: sreehari ,Published On : September 1, 2020 / 08:23 PM IST
ఒకే ఫ్యామిలీలో 32 మందికి కరోనా పాజిటివ్

కుటుంబాన్ని కరోనా కాటేసింది.. ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా సోకింది.. ఉత్తరప్రదేశ్‌లో నమోదైన ఈ 32 కరోనా పాజిటివ్ కేసులతో కలకలం రేగింది. రాష్ట్రంలోని బండాలో నివసిస్తున్న 32 మంది కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని నిర్ధారించారు. కరోనా పరీక్షల్లో మొత్తం కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని అధికారులు తేల్చారు.



అంతేకాదు.. మరో 44 మందికి కూడా కరోనా సోకిందని నిర్ధారించారు. దాంతో మొత్తంగా ఆ జిల్లాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 807కు చేరిందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్ డీ శర్మ తెలిపారు.



అదే రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన జర్నలిస్ట్ నీలన్షు శుక్లా మరణించారు. ఆయనలో ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ తేలింది. సన్నిహితంగా మెలిగిన వారిని అప్రమత్తంగా ఉండాలని ఆగస్టు 20న ట్విట్టర్ ద్వారా కోరారు. ఇంతలోనే శుక్లా ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయారు.



దేశంలో ఇప్పటికే 36 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 65 వేలమంది చనిపోయారు. యూపీ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,414 కు చేరింది.. మొత్తంగా 3,486 మంది కరోనా బారిన పడి మృతిచెందారు.