Fox Attack : గ్రామంపై నక్కల దాడి..38 మందికి గాయాలు
గురువారం తెల్లవారుజామున జనావాసాల్లోకి ప్రవేశించిన నక్కలు 38 మందిని గాయపరిచాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది
Fox Attack : పశ్చిమబెంగాల్లోని మాల్డా జిల్లాలో నక్కలు స్వైరవిహారం చేశాయి. జిల్లాలోని హరీశ్చంద్రాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హర్దాంనగర్ గ్రామంలో గురువారం తెల్లవారు జామున 15 నుంచి 20 నక్కలు ప్రవేశించాయి. ఇంటిబయట పడుకున్న వ్యవారిపై దాడి చేశాయి. ఈ దాడిలో 38 మందికి గాయాలు కాగా వీరిలో 20 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.
చదవండి : West Bengal Election Result ఇది బెంగాల్ విజయం..విజయోత్సవాలు వద్దు…వీల్ చైర్ వదిలేసిన Mamata Banerjee
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు వివరించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులందరూ ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే తేరుకొని వారికి దొరికిన రెండు నక్కలను కొట్టి చంపేశారు. మిగతావి తప్పించుకు పారిపోయాయి.
చదవండి : West Bengal: బెంగాల్లో మార్చి నాటికి 32వేల టీచర్ ఉద్యోగాలు