ప్రజలే పవర్ పుల్ : ప్రకాష్ రాజ్ నామినేషన్

  • Published By: madhu ,Published On : March 22, 2019 / 10:00 AM IST
ప్రజలే పవర్ పుల్ : ప్రకాష్ రాజ్ నామినేషన్

ప్రధాన మంత్రిని ప్రజలు నేరుగా ఎన్నుకోరని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే ఎన్నుకుంటారని ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ అన్నారు. ఈయన బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీ శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…ప్రజల నుంచి తనకు పూర్తి మద్దతు లభిస్తుందని చెప్పారు.
Read Also : పోలీసుల షాక్ : ప్రకాష్ రాజ్ నామినేషన్ పై డైలమా

బెంగళూరు సెంట్రల్‌ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. మోది వచ్చి ఇక్కడ ఏం చేయరని అన్న ప్రకాష్ రాజ్..రాజకీయాన్ని వ్యాపారం చేయడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. ప్రజలే పవర్‌ ఫుల్‌ అని ఆయన స్పష్టం చేశారు. కర్నాటక నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న మోది, రాహుల్‌కు తమ నియోజకవర్గాల్లో గెలుస్తామని నమ్మకం లేదా అని ప్రశ్నించారు. రెండో నియోజకవర్గంలో పోటీ చేయడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రకాశ్‌ రాజ్‌ విమర్శించారు.
Read Also : ఎన్నిక‌ల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్ల‌యింట్