Air India Servers : ఎయిర్ ఇండియాకు కొత్త కష్టం, సర్వర్లు హ్యాక్.. 45 లక్షల మంది డేటా చోరీ!

దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కొత్త కష్టం వచ్చిపడింది. సంస్థపై భారీ సైబర్‌ అటాక్‌ జరిగిందని.. సంస్థ సర్వర్లు హ్యాక్ అయ్యాయని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

Air India Servers : ఎయిర్ ఇండియాకు కొత్త కష్టం, సర్వర్లు హ్యాక్.. 45 లక్షల మంది డేటా చోరీ!

Air India

45 Lakh Customers Leaked : దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కొత్త కష్టం వచ్చిపడింది. సంస్థపై భారీ సైబర్‌ అటాక్‌ జరిగిందని.. సంస్థ సర్వర్లు హ్యాక్ అయ్యాయని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగినట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురైందని.. ప్రయాణికులకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్టు, వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ తదితర వివరాలన్నీ లీకైనట్లు ప్రకటించింది. డేడా చోరీకి గురైన వారిలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారని పేర్కొంది.

2011 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలానికి సంబంధించిన డేటా హ్యాకింగ్ జరిగినట్టు నిర్ధారించాయి ఎయిర్‌ ఇండియా వర్గాలు. హ్యాకింగ్ జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. వెంటనే ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యామని.. వెంటనే డేటా భద్రతకు సంబంధించిన పాస్‌వర్డ్స్ ను రీసెట్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాసింజర్లు తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచించింది ఎయిర్‌ ఇండియా.

Read More : BA Raju : ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత