బీజేపీ నేత దారుణ హత్య
జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా నౌగాంలో ఉగ్రవాదులు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. బీజేపీ లీడర్ గుల్ ముహమ్మద్ మిర్(60)ను దారుణంగా హత్య చేశారు ఉగ్రవాదులు. నౌగాం గ్రామంలోని మిర్ నివాసంపై దాడిచేసిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. మిర్ అనంతనాగ్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాల్పుల ఘటనలో మిర్ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుని వెళ్లడంతో చనిపోయొనట్లు పోలీసులు తెలిపారు.
కాగా గుల్ ముహమ్మద్ మిర్ హత్యపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ‘‘పిరికిపందల చర్య’’ అనీ ఆ రాష్ట్ర బీజేపీ అధాకార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ అన్నారు. 2008, 2014లలో మీర్ డోర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.