Mukul Roy : బీజేపీకి బిగ్ షాక్..టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్

ప‌శ్చిమ బెంగాల్‌లో భార‌తీయ జ‌నతా పార్టీకి భారీ షాక్ తగిలింది.

Mukul Roy : బీజేపీకి బిగ్ షాక్..టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్

టీఎంసీలోకి ముకుల్ రాయ్! (1)

Mukul Roy ప‌శ్చిమ బెంగాల్‌లో భార‌తీయ జ‌నతా పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్​ నేత ముకుల్​రాయ్ తిరిగి టీఎంసీ గూటికి చేరారు. ముకుల్​రాయ్​ తృణమూల్​ కాంగ్రెస్​లో చేరుతారు అనే ఉహాగానాలను నిజం చేస్తూ ఆయన శుక్రవారం మధ్యహ్నం తన కుమారుడు సుభ్రంగ్సు రాయ్ తో కలిసి కోల్​కతాలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో సమక్షంలో వారిద్దరూ టీఎంసీలో చేరారు. ముకుల్ రాయ్ ని తిరిగి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు.

మమతా బెనర్జీతో తనకు ఎప్పుడూ బేధాభిప్రయాలు లేవని టీఎంసీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముకుల్ రాయ్ పేర్కొన్నారు. బీజేపీని వీడవలసి వచ్చిందని..తిరిగి టీఎంసీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనాతాపార్టీలో ఎవ్వరూ ఉండరని ముకుల్ రాయ్ అన్నారు.

తృణమూల్​ కాంగ్రెస్​ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్​ రాయ్​.. 2017లో పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షునిగా సేవ‌లందించారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. బీజేపీ గురువారం నిర్వ‌హించిన స‌మావేశానికి ముకుల్ రాయ్ హాజ‌రు కాలేదు.