అద్వానీ,జోషిలతో సమావేశమైన అమిత్ షా

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2019 / 04:10 PM IST
అద్వానీ,జోషిలతో సమావేశమైన అమిత్ షా

బీజేపీ వ్యవస్థాపక సభ్యులు ఎల్ కే అద్వానీ,మురళీ మనోహర్ జోషిలను వేర్వేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు.ఈ ఎన్నికల సమరంలో వారిని చెప్పా చేయకుండా, అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తోన్నసమయంలో ఆ అగ్రనేతలను బుజ్జగించడానికి అమిత్ షా సోమవారం(ఏప్రిల్-8,2019)ఢిల్లీలోని వారి వారి నివాసాల్లో వారితో సమావేశమయ్యారు.

ఏళ్లుగా అద్వానీ గుజరాత్ లోని  గాంధీ నగర్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే ఈ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అమిత్‌ షా పోటీ చేస్తున్నారు.దీనిపై కొద్ది రోజులు మౌనంగా ఉన్న అద్వానీ మూడు రోజుల క్రితం తన బ్లాగ్ ద్వారా స్పందించారు.విమర్శకులను పార్టీ ఎప్పుడు జాతి వ్యతిరేకులుగా చూడలేదని, ప్రజాస్వామ్య విధానాలకు పార్టీ పెట్టింది పేరని సందేశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ సీనియర్ నాయకుడొకరు తనను కోరారని జోషీ  బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.