అంతా క్షణాల్లోనే : ఆటోను ఢీకొని నదిలో పడ్డ కారు

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 03:22 AM IST
అంతా క్షణాల్లోనే : ఆటోను ఢీకొని నదిలో పడ్డ కారు

బైటకెళితే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బాగానే వెళ్తున్నాం అనుకునే సయమంలో ఏం జరుగుతుందో మనకు అర్థం అయ్యేలోపే జరిగిపోతుంది. అటువంటి ఘటన మధ్యప్రదేశ్‌లోని నైవారి జిల్లా ఓర్చా పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. సోమవారం (అక్టోబర్ 28)న జరిగిన ఈ రోడ్డుప్రమాదం క్షణాల్లో జరిగిపోయింది. 

వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుగురితో పాటు ఇద్దరు చిన్నారులు  కూడా ఉంది.  కారులో ఉన్నవారిలో ఒకరు ఓ చిన్నారిని బైటకు తీసి వంతెనపై ఉన్న స్థానికులవైపు విసిరాడు. కానీ పట్టు తప్పి చిన్నారి నీటిలో పడిపోయింది. 

వెంటనే చిన్నారిని విసిరిన వ్యక్తితో పాటు స్థానికులు కూడా నదిలో దూకి చిన్నారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం స్థానికులు సహాయంతో కారులో ఉన్నవారు కూడా చిన్నపాటి గాయాలతో బైటపడ్డారు. గాయపడిన వారిని  ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కారు ఢీకొన్ని ఆటో మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది.