లాక్ డౌన్ 2.0 : ఏప్రిల్-20తర్వాత అనుమతించనున్న లిస్ట్ లో మరికొన్నింటిని చేర్చిన కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2020 / 08:44 AM IST
లాక్ డౌన్ 2.0 : ఏప్రిల్-20తర్వాత అనుమతించనున్న లిస్ట్ లో మరికొన్నింటిని చేర్చిన కేంద్రం

కరోనా ప్రభావం పెద్దగా లేని దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్-20తర్వాత పలురంగాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్రప్రభుత్వం రెండురోజుల క్రితం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మినహాయింపుల లిస్ట్ లో కొత్తగా మరికొన్నింటిని కేంద్ర ప్రభుత్వం చేర్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు,మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ లను ఎసెన్షియల్ సర్వీసెస్ కింద గుర్తిస్తూ వాటికి ఏప్రిల్-20నుంచి లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది.

దీంతో అవి తిరిగి తమ కార్యకాలాపాలను ప్రారంభించనున్నాయి. షెడ్యూల్డ్ తెగలవాళ్లు చేసే అటవీ ఉత్పత్తులు,వక్కమరియు కోకో తోటలు,కొబ్బరి,స్పైస్ బాంబో లను ఆంక్షల సడలింపు లిస్ట్ లో చేర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా మరియు పారిశుధ్యం మరియు విద్యుత్ లైన్లు మరియు టెలికాం ఆప్టికల్ ఫైబర్స్ మరియు కేబుల్స్ వేయడం కూడా అనుమతించబడుతుందని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ తెలిపింది.

గ్రాసరీస్,మెడిసిన్స్ వంటి అవసరమైన వస్తువులతో కలిపి మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, బట్టలు మరియు పాఠశాల విద్యార్థుల కోసం స్టేషనరీ వస్తువులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మవచ్చు అని గత రాత్రి కేంద్రప్రభుత్వం చెప్పింది. అయితే ఈ-కామర్స్ కంపెనీలు తమ వాహనాలు రోడ్లపై తిరిగేందుకు అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

కరోనా కట్టడిలో భాగంగా మే-3వరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ లాక్ డౌన్ ను పొగిడించిన తర్వాత పారిశ్రామిక,వాణిజ్య కార్యకలాపాలు,నిర్మాణ మరియు తయారీరంగం కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవడానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తక్కువ సిబ్బందితో ఐటీ సంస్థలు,పరిశ్రమలు,ముఖ్యమైన సంస్థలు పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే పనిప్రదేశాల్లో సామాజికదూరం పాటాంచాల్సిందేనని,ఇతర ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సృష్టంచేస్తూ కూడా కేంద్రహోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.