Chhattisgarh: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై మావోయిస్టుల కాల్పులు

Chhattisgarh: ఈ ఘటన జరిగిన సమయంలో కాన్వాయ్ లో పంచాయతీ సభ్యుడు పార్వతీ కశ్యప్ కూడా ఉన్నారు.

Chhattisgarh: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై మావోయిస్టుల కాల్పులు

Congress MLA Vikram Mandavi

Chhattisgarh: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపి కలకలం రేపారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మందవి (Congress MLA Vikram Mandavi) ఓ బహిరంగ సభలో పాల్గొని తిరిగి వెళ్తున్నారు. బీజాపూర్ మీదుగా ఆయన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు.

ఈ ఘటన జరిగిన సమయంలో కాన్వాయ్ లో పంచాయతీ సభ్యుడు పార్వతీ కశ్యప్ కూడా ఉన్నారు. కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు కూడా నిర్ధారించారు. ఛత్తీస్‌గఢ్ లో ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కాల్పులకు తెగబడుతున్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.

దంతెవాడలో 2019 ఏప్రిల్ లో బీజేపీ ఎమ్మెల్యే భీమా మందవి ( BJP MLA Bhima Mandavi) కాన్వాయ్ పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో ఆయనను ప్రాణాలు కోల్పోయారు. 2019 ఎన్నికలను బహిష్కరించాలంటూ అప్పట్లో మావోయిస్టులు పిలుపునిచ్చారు. స్థానికులు ఎవరూ ఓట్లు వేయొద్దని మావోయిస్టులు చెప్పారు. అయినప్పటికీ బస్తర్ లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికలు జరిగిన రెండు రోజులకే దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మందవిని మావోయిస్టులు చంపేశారు.

Alabama shooting: చెల్లి ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన అన్న