Coronavirus : 30 రోజులు..79 వేల మంది చిన్నారులకు కరోనా

సెకండ్ వేవ్ లో మాత్రం చిన్నారులపై పంజా విసురుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే...దేశ వ్యాప్తంగా 79 వేల 688 మంది చిన్నారులకు వైరస్ సోకడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Coronavirus : 30 రోజులు..79 వేల మంది చిన్నారులకు కరోనా

Coronavirus in Babies

covid surge : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే..గత సంవత్సరం వచ్చిన ఈ కరోనా వైరస్ పెద్దలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లో మాత్రం చిన్నారులపై పంజా విసురుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే…దేశ వ్యాప్తంగా 79 వేల 688 మంది చిన్నారులకు వైరస్ సోకడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మార్చి 01 నుంచి ఏప్రిల్ 04వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ట్రలో 60 వేల 684 మంది చిన్నారులకు కరోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9 వేల 882 మంది ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఛత్తీస్ గడ్ లో 5 వేల 940 మంది పిల్లలు కరోనా బారిన పడగా..922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. కర్నాటకలో 7 వేల 327 మంది, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 3 వేల 004 మంది ఐదేళ్ల లోపు చిన్నారులున్నారు.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే..ఇలాంటి పరిస్థితే నెలకొందని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఢిల్లీలో 2 వేల 733 మంది పిల్లలు కరోనా రాగా…ఐదేళ్ల లోపు చిన్నారులు 441 మంది ఉన్నారు. కరోనా సోకిన చిన్నారుల్లో అత్యధికంగా పేదరికం నుంచి వచ్చిన వారే ఉన్నారు. చిన్న పిల్లలకు ఆస్ట్రాజెనీకా టీకా అందుబాటులోకి వచ్చినా..దానివల్ల పిల్లల్లో బ్లడ్ క్లాటింగ్ అవుతుండడంతో ఆ టీకాను నిలిపివేశారు.

Read More : మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత..అదేం లేదంటున్న కేంద్రం‌