నిర్భయ దోషుల మరణశిక్ష : ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన కేంద్రం

నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 12:09 PM IST
నిర్భయ దోషుల మరణశిక్ష : ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన కేంద్రం

నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది.

నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. క్షమాభిక్ష అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని హైకోర్టు తెలిపింది. వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం వినతిని తోసిపుచ్చింది. నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

నిర్భయ దోషుల ఉరిశిక్షను అమలు వెంటనే జరపాలి..వేర్వేరుగా అయినా వీరిని ఉరి తీయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర వినతిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. నలుగురిని ఒకేసారి ఉరితీయాలని నిబంధన ఉందని చెప్పింది. నిర్భయ దోషులకు వారం రోజుల సమయం ఇచ్చింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలును వెంటనే జరపాలని కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష ఒకేసారి అమలు కావాల్సివుంటుంది. దీనికి సంబంధించిన జైలు నిబంధనలు 834, 836 అంశాలను కోడ్ చేస్తూ ఆర్టికల్ 21ను ఉపయోగించి వీరు ఉరిశిక్ష అమలును జాప్యం చేస్తున్నారన్న విషయాన్ని కూడా హైకోర్టు వ్యక్త పరిచింది.

అయితే న్యాయపరంగా వీరికి ఉన్న అవకాశాలను వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు నుంచి వారం రోజుల్లోపు దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాల్సివుంటుంది. ఇప్పటికే వినయ్, ముఖేష్ కు సంబంధించి న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. అక్షయ్ కు సంబంధించి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. పవన్ కు సంబంధించి క్యురేటివ్ పిటిషన్, అలాగే మెర్సీ పిటిషన్ ఫైల్ చేయాల్సివుంది. ఈ ఇద్దరు కూడా వారం రోజుల్లోగా వారికున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో వీరు వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. 

తదుపరి వీరు వినియోగించుకున్న న్యాయమైన అవకాశాల ఆధారంగానే చట్టపరంగా వ్యవహరించాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు చెక్ పాయింట్ పెట్టిందని చెప్పవచ్చు. వీరికి వారం రోజుల సమయం విధించడంతో ఒకరి తర్వాత ఒకరు కాకుండా నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలన్న నిబంధనకు లోబడే ముఖ్యంగా వీరికున్న అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆఖరి అవకాశం ఇచ్చింది. జైలు నిబంధనల్లో ఉన్న లొసుగులకు సంబంధించి సొలిసిటర్ జనరల్ వాదనలను పరిగణనలోకి తీసుకొని, ముఖ్యంగా వేర్వేరుగా వీరికి ఉరిశిక్ష విధించలేమని, అందుకు నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని, తీహార్ జైలు నిబంధనలను కోడ్ చేస్తూ ఆ విధంగా ఉరితీయలేమన్న అంశాలను హైకోర్టు స్పష్టం చేసింది.

వారం రోజుల్లో అక్షయ్, పవన్ ఉన్న అవకాశాలను వినియోగించుకున్న తర్వాత తదుపరి విచారణ అనేది జరుగబోతుంది. ఈ వ్యవహారం మళ్లీ కోర్టులోకి వస్తుంది. ప్రస్తుతం అక్షయ్ మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి వద్ద ఉంది..అది రిజక్ట్ అయితే కనుక కచ్చితంగా కోర్టులో ఇంటిమేషన్ చేస్తారు. మళ్లీ కోర్టు నుంచి..వారం రోజుల్లో వీరికి ఉన్న అవకాశాలను వినియోగించుకున్న తర్వాత అక్షయ్ కు సంబంధించిన మెర్సీ పిటిషన్ కనుక రిజక్ట్ అయితే 14 రోజులు సమయం ఉంటుంది. అలాగే పవన్ క్యూరేటివ్ పిటిషన్, మెర్సీ పిటిషన్ రిజక్ట్ అయితే మళ్లీ 14 రోజుల సమయం ఉంటుంది. 

అయితే ఈ జాప్యానికి సంబంధించి మాత్రం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కను పెట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇందుకు నిబంధనలు ఉన్నాయి.. నిబంధనలకు అనుగునంగానే వ్యవహరించాల్సివుంటుంది. పూర్తిగా చట్టంలో మార్పు తెస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పటికప్పుడు నలుగురు దోషుల్లో ఎవరైతే అవకాశాలు పూర్తి అయినా వారిని వేరుగా ఉరితీయాలని కోరారో దానికి మాత్రం నిరాకరించారు. ఒకేకేసులో ఈ నలుగురు నిందితులుగా ఉన్నారు కాబట్టి నలుగురికి ఒకేసారి ఉరిశిక్ష అమలు కావాల్సివుంది. వీరు అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న తర్వాతే దోషులకు ఉరిశిక్ష అనేది అమలు కాబోతోంది. దానికి వారం రోజుల సమయాన్ని ఢిల్లీ హైకోర్టు ఈరోజు కేటాయించింది. 

దీన్ని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషులకు వారం రోజుల సమయం ఇవ్వడాన్ని కూడా కేంద్రం సవాల్ చేసింది. ముఖేశ్, వినయ్ కు సంబంధించి న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోయాయి. వారికి ఎటువంటి నిబంధనలు వర్తించవు. వారిని వేరుగా ఉరితీయాలి. ఎవరికైతే న్యాయపరమైన అవకాశాలున్నాయో వారు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. 

కానీ ఇప్పటికే నిర్భయ దోషులకు ఉరిశిక్ష జాప్యం కావడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది. ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రభావం చేస్తుందన్న అంశాలను సొలిసిటరల్ జనరల్ ఢిలీ హైకోర్టులో వాదనలు వినిపించారు. కానీ ఆ వాదనలను కోర్టు పట్టించుకోలేదు. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీర్పును అంగీకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రేపు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో కూడా వాదనలు సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది.