లంచగొండి అధికారికి షాక్ : లంచం అడిగాడని బర్రెను జీపుకు కట్టేశాడు

  • Published By: madhu ,Published On : February 24, 2019 / 10:33 AM IST
లంచగొండి అధికారికి షాక్ : లంచం అడిగాడని బర్రెను జీపుకు కట్టేశాడు

లంచం అడుగుతావా నీకు కరెక్టు బద్ది చెబుతా అంటూ ఓ రైతు వినూత్నంగా బదులు చెప్పాడు. ఇది చూసిన లంచగొండి ఆఫీసర్‌ షాక్ తిన్నాడు. దిమ్మతిరిగే రీతిలో సమాధానం చెప్పిన రైతు విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఓ అధికారి లంచం అడిగాడని వృద్ధ దంపతులు బిక్షాటన చేసిన సంగతి తెలిసిందే. ఆ రైతు ఎవరు ? తదితర వివరాల కోసం చదవండి…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవ్‌పూర్ గ్రామంలో రైతు లక్ష్మి యాదవ్ నివాసం ఉంటున్నాడు. కోడళ్ల పేరిట కొంత భూమిని కొన్నాడు. యాజమాన్య హక్కుల బదలాయింపు..ఇతర పనుల కోసం ఖర్గాపూర్ రెవెన్యూ ఆఫీసుకు లక్ష్మణ్ ఫిబ్రవరి 23వ తేదీ శనివారం వెళ్లాడు. అక్కడ తహశీల్దార్ సునీల్ వర్మను కలిశాడు. మ్యూటేషన్, ఇతర పనులు చేయాలంటే రూ. లక్ష డిమాండ్ చేశాడని యాదవ్ తెలిపారు. తన దగ్గర అంత డబ్బు లేదని, రూ. 50వేలు ఇస్తానని చెప్పినా అతను వినిపించుకోలేదని పేర్కొన్నారు. చేసేది ఏమీ లేక తన బర్రెను తీసుకెళ్లి ప్రభుత్వానికి చెందిన జీపుకు కట్టేసినట్లు పేర్కొన్నారు. 

అక్కడే గడ్డి వేసి బర్రె ఆకలిని తీర్చాడు యాదవ్. ఇతని పరిస్థితి తెలుసుకున్న కొంతమంది సెల్ ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. వెంటనే కలెక్టర్ సౌరవ్ కుమార్ స్పందించారు. ఘటనపై ఓ అధికారిని నియమించి విచారణకు ఆదేశించారు. అధికారిగా నియమించబడిన రాజ్ పుత్ జరిపిన విచారణలో అధికారి లంచం అడిగినట్లు తేలింది.