IPS Pooja Yadav : IPS ఆఫీసర్ అయిన రిసెప్షనిస్ట్

‘హాలో సార్’..అని వచ్చిన అతిథుల్ని వినంగా పలకరించే రిసెప్షనిస్ట్ స్థాయి నుంచి..సెట్యూట్ కొట్టించుకునే IPS ఆఫీసర్ స్థాయికి ఎదిగారు హర్యానాకి చెందిన పూజా యాదవ్. ఎన్నో కష్టాలను ఎదుర్కొని UPSC ఎగ్జామ్స్‌లో విజయం సాధించి..తన కలను నెరవేర్చుకుని IPS ఆఫీసర్ అయ్యారు.

IPS Pooja Yadav : IPS ఆఫీసర్ అయిన రిసెప్షనిస్ట్

Pooja Yadav

IPS Pooja Yadav Successful story : కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని ఎంతోమంది నిరూపించారు. పేదింటిలో పుట్టిన ప్రతిభతో అనుకున్నది సాధించినవారు ఎంతోమంది. అంగవైకల్యం ఉన్నా..పట్టుదలతో తమలోని ప్రతిభను చాటి చెప్పారు ఇంకెంతోమంది. ఇలా ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ స్ఫూర్తిప్రదాతలుగా మారొచ్చనీ మరో అమ్మాయి నిరూపించింది. ‘హాలో సార్’..అని వచ్చిన అతిథుల్ని వినంగా పలకరించే రిసెప్షనిస్ట్ స్థాయి నుంచి..సెట్యూట్ కొట్టించుకునే IPS ఆఫీసర్ స్థాయికి ఎదిగారు హర్యానాకి చెందిన పూజా యాదవ్.

హర్యానాకి చెందిన పూజా యాదవ్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని UPSC ఎగ్జామ్స్‌లో విజయం సాధించారు. IPS ఆఫీసర్ అయ్యారు. తరువాత ఎంటెక్ చేయటానికి చాలా కష్టపడ్డారు ఆర్థికంగా. అలా ఎలాగోలాగా బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలో… ఎంటెక్ పూర్తి చేశాక కొన్నేళ్లు కెనడా, జర్మనీలో పని చేశారు. కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కానీ IPS అవ్వాలనే కలను మాత్రం మరచిపోలేదు. ఉద్యోగం చేసే సమయంలో తాను విదేశాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాననీ, ఇండియా కోసం చేయట్లేదనీ గుర్తించారు. అంతే వెంటనే ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చారు. IPS అవ్వాలనే కలను నెరవేర్చుకోవటానికి ఇండియాలో అడుగు పెట్టిన పూజాకు UPSC ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కాస్త కష్టమే అయ్యింది. ఎందుకంటే కొంతకాలం చదువుకు దూరంగా ఉద్యోగంలోనే ఉండిపోయారు కాబట్టి.

ఇండియా వచ్చాక పూజా యాదవ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎగ్జామ్స్ (సివిల్స్) రాయాలని అనుకున్నారు. దాని కోసం చాలా కష్టపడ్డారు. అదో తపస్సులా భావించారు. ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్స్ రాసినా విజయం సాధించలేకపోయారు.దీంతో మరింత పట్టుదలతో మరోసారి యత్నించి ఎలాగైనా సరే అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశంపై సాధన చేశారు. మెళకువల నేర్చుకున్నారు. దానికి చక్కగా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఓ క్రమ పద్ధతిలో చదివారు. అలా రెండోసారి ఎగ్జామ్స్ రాసి విజయం సాధించారు. 2018 కేడర్‌లో IPSగా నియమితులయ్యారు.

ఎలాగైతేనే పూజా యాదవ్ IPS అయ్యారు. కానీ అది అనుకున్నంత తేలికగా అవ్వలేదు. పైగా ఎంతో తేలిగ్గా కనిపిస్తున్నా…తన కల నెరవేర్చుకోవటానికి ఆమె చాలా చాలా కష్టపడ్డారు. పూజా కుటుంబం ఆర్థికంగా అంత బలమైనదేమీ కాదు. చదువుకి అయ్యే ఖర్చుల కోసం ఆమె చాలా కష్టాలు పడ్డారు.కుటుంబంలో అందరూ ఉద్యోగం వదిలి వచ్చి తిరిగి చదువుకోవాలనే ఆమె కోరినకు మద్దతుగా నిలిచారు. అందరి సహకారం అయితే ఉందిగానీ ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బు పెద్ద సమస్య అయ్యింది. ఎంటెక్ చదవడానికీ, విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లడానికీ పూజా యాదవ్ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ UPSC చదవాలంటే మరింత డబ్బు కావాల్సి రావడంతో…చేతిలో సరిపడా డబ్బులు లేక పిల్లలకు ట్యూషన్లు చెప్పటం..రిసెప్షనిస్టుగా కూడా పనిచేసి ఆ డబ్బులు సమకూర్చుకుని ఖర్చు పెట్టుకుని ప్రిపేర్ అయ్యారు.

ఈ సందర్భంగా పూజా యాదవ్ మాట్లాడుతూ..UPSC చదవాలంటే కష్టపడాలి. అదో తపస్సులా భావించారు. పట్టుదల పెంచుకోవాలి. అదృష్టం కంటే… కష్టాన్ని నమ్ముకోవాలి. అప్పుడే విజయం వరిస్తుంది..అనుకున్నది సాధిస్తారని తెలిపారు. నిరాశ ఎదురైందని లక్ష్యాలను సాధించటం మానుకోకూడదు. ఏకాగ్రతను వదలకూడని అప్పుడే అనుకున్నది సాధిస్తారని పూజా యాదవ్ తెలిపారు.IPS పూజా యాదవ్ IAS ఆఫీసర్ వికల్ప్ భరద్వాజ్‌ను ఫిబ్రవరి 18,2021న వివాహం చేసుకున్నారు.

వీరిద్దరూ భార్యాభర్తలు కాకముందు ముస్సోరీలో సివిల్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో తొలిసారి కలిశారు. పూజా భర్త వికల్ప్ 2016 బ్యాచ్… ఆఫీసర్. కేరళ కేడర్. పెళ్లి తర్వాత… పూజ కోసం ఆయన గుజరాత్ కేడర్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. పూజ యాదవ్… సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 2.5 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి సోషల్ మీడియాను మించినది లేదని అంటారు పూజా యాదవ్.