నీరవ్ బెయిల్ పై సస్పెన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2019 / 01:19 PM IST
నీరవ్ బెయిల్ పై సస్పెన్స్

పీఎన్ బీ స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండవ బెయిల్ అప్లికేషన్ పై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో శుక్రవారం(మార్చి-29,2019)వాదనలు ప్రారంభమయ్యాయి.నీరవ్ మోడీ భారత దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న టోబే కాడ్ మాన్  చీఫ్ జస్టిస్ కి తెలిపారు.
Read Also : దేన్నీ వదలటం లేదు : రైల్వేలో టీ కప్పులపై మోడీ చౌకీదార్

బెయిల్ ఇస్తే నీరవ్ పారిపోయే ప్రమాదం ఉందని,సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదముందని టోబే న్యాయస్థానానికి తెలిపారు.నీరవ్ కి బెయిల్ ఇస్తే ఆధారాలు నాశనం చేస్తాడని తెలిపారు.వాదనలు విన్న కోర్టు లండన్ సమయం ప్రకారం మధ్యాహ్నాం 2:10గంటలకు వాయిదా వేసింది

Read Also : మెట్రో ప్రయాణికులకు ఐపీఎల్ ఆఫర్