ఒడిషా తీరంలో..క్షిపణి ప్రయోగం సక్సెస్

  • Published By: venkaiahnaidu ,Published On : February 26, 2019 / 03:46 PM IST
ఒడిషా తీరంలో..క్షిపణి ప్రయోగం సక్సెస్

భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగం ఒడిషా తీరంలో సక్సెస్ అయింది. బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ట్రక్కుపై నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ మిసైల్ ను డీఆర్ డీవో పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో భారత ఆర్మీ కోసం తయారు చేసింది. డీఆర్ డీవో ఆర్మీ కోసం తయారు చేసిన రెండు మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించారు.