ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి భారత్ లో కరోనా ఉగ్రరూపం : SBI రిపోర్ట్

ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు ఉండ‌వచ్చని కూడా ఆ రిపోర్ట్ స్ప‌ష్టం చేసింది.

ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి భారత్ లో కరోనా ఉగ్రరూపం : SBI రిపోర్ట్

Indias Current Covid Wave Could Peak In 2nd Half Of April Sbi Report1

India ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు ఉండ‌వచ్చని కూడా ఆ రిపోర్ట్ స్ప‌ష్టం చేసింది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ప్రారంభ‌మైన ఈ సెకండ్ వేవ్‌.. ఏప్రిల్ 15 త‌ర్వాత మ‌రింత ముదురుతుంద‌ని అంచ‌నా వేసింది. మార్చి 23 వ‌ర‌కూ న‌మోదైన కేసుల ట్రెండ్‌ను బ‌ట్టి చూస్తే భారత్ లో సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య 25 ల‌క్ష‌లుగా ఉంటుంద‌ని తెలిపింది.

క‌రోనా సెకండ్ వేవ్‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్లు, ఆంక్ష‌లు అంత ప్ర‌భావం చూపించ‌డం లేద‌ని ఈ 28 పేజీల నివేదిక స్ప‌ష్టం చేసింది. పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ చేప‌ట్ట‌డ‌మే దీనికి ఏకైక ప‌రిష్క‌రమ‌ని తేల్చి చెప్పింది. ప్ర‌స్తుతం రోజుకు 34 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ ఇస్తుండ‌గా.. దీనిని క‌నీసం 40-45 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని చెప్పింది. అలా చేస్తే 45 ఏళ్లు పైబ‌డిన అందరికీ వ్యాక్సినేష‌న్ పూర్తి చేయ‌డానికి 4 నెల‌లు ప‌డుతుంది. ఇక,పలు రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్‌డౌన్లు, ఆంక్ష‌ల ప్ర‌భావం వ్యాపారాల‌పై ఎలా ఉంటుందో వ‌చ్చే నెల‌లో తెలుస్తుంద‌ని ఎస్‌బీఐ రిపోర్ట్ తెలిపింది.

మరోవైపు, గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాబోయే కొన్ని నెలలు విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతిని విస్తరించదని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. దేశీయ డిమాండ్‌ను నెరవేర్చేందుకు రానున్న కొన్నినెలలు ఎగుమతులను విస్తరించబోమని అధికారులు పేర్కొన్నారు. జనవరి 20 నుంచి ఇండియా విదేశాలకు టీకా డోసులను పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు 80 దేశాలకు 60.4 మిలియన్‌ మోతాదుల కొవిడ్‌ వ్యాక్సిన్లను భారత్ సరఫరా చేసింది.