Encounter : కశ్మీర్ లో ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ ఉబైద్ హతం

కశ్మీర్ లోని హంద్వారాలో ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా భద్రతా దళాలు మరోమారు పైచేయి సాధించాయి. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ ఉబైద్ ను భధ్రతా దళాలు హతమార్చాయి. హిజ్బుల్ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ మెహ్రాజుద్దీన్‌ హల్వాయి అలియాస్‌ ఉబైద్‌ భారత్ సైన్యం మట్టుబెట్టింది.

Encounter :  కశ్మీర్ లో ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ ఉబైద్ హతం

Hizbul Mujahideen Top Commander Killed (4)

Hizbul mujahideen top commander killed : కశ్మీర్ లో తుపాకుల మోత మోగుతునే ఉంది. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఈక్రమంలో కశ్మీర్ లోని హంద్వారాలో ఎదురు కాల్పులు జరుగుతున్న క్రమంలో ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా భద్రతా దళాలు మరోమారు పైచేయి సాధించాయి. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ ఉబైద్ ను భధ్రతా దళాలు హతమార్చాయి. హిజ్బుల్ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ మెహ్రాజుద్దీన్‌ హల్వాయి అలియాస్‌ ఉబైద్‌ భారత్ సైన్యం మట్టుబెట్టింది. బుధవారం (జులై 7,2021) తెల్లవారుజామున జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉబైద్‌ హతమయ్యాడు. గతంలో ఉబైద్‌ అనేక ఉగ్రవాద నేరాలకు పాల్పడినట్లు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇది తమకు చాలా పెద్ద విజయమని ట్వీట్‌ చేశారు.

కాగా గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఉగ్రమూకలను మట్టు పెట్టటానికి భారత సైన్యం కాల్పులు జరుపుతున్నాయి. దీంట్లో భాగంగా గత కొన్ని రోజుల క్రితం కూడా కాల్పులు జరిగాయి. పుల్వామా ఎన్​కౌంటర్​జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో రాజ్​పుర్​ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య పరస్పర కాల్పులు జరిగగా..ఐదుగురు మిలిటెంట్లు హతమవగా ఓ జవాన్​ వీరమరణం పొందారు. మిలిటెంట్లు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించామరి ఉన్నతాధికారులు తెలిపారు.

మృతుల్లో లష్కరే తోయిబా జిల్లా కమాండర్, పాకిస్తాన్‌ ఉగ్రవాది ఉన్నారు.హన్జిన్​ గ్రామంలో ముష్కరులు ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని వారి కోసం గాలింపు చేపట్టారు. బలగాలను గుర్తించిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తం అయిన అధికారులు.. ముష్కరులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఈక్రమంలో మరోసారి భద్రతా దళాలకు ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో మరోసారి భారత్ ఆర్మీ పైచేయి సాధించింది. హిజ్బుల్ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ మెహ్రాజుద్దీన్‌ హల్వాయి అలియాస్‌ ఉబైద్‌ భారత్ సైన్యం మట్టుబెట్టింది.