Jharkhand: చెట్టుకు వేలాడదీసి.. కళ్లు పీకేసి అనుమానస్పద స్థితిలో టీనేజర్ డెడ్‌బాడీ

ఝార్ఖండ్ లోని పాలమూ జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. లాలిమతి అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు 16ఏళ్ల టీనేజర్ డెడ్ బాడీ వేలాడుతూ అనుమానస్పద స్థితిలో కనిపించింది. ఆ బాలిక కుడి కన్ను కూడా పీకేసినట్లుగా తెలుస్తోంది.

Jharkhand: చెట్టుకు వేలాడదీసి.. కళ్లు పీకేసి అనుమానస్పద స్థితిలో టీనేజర్ డెడ్‌బాడీ

Jharkhand Bjp Leaders Daughter Found Hanging From Tree

Jharkhand: ఝార్ఖండ్ లోని పాలమూ జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. లాలిమతి అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు 16ఏళ్ల టీనేజర్ డెడ్ బాడీ వేలాడుతూ అనుమానస్పద స్థితిలో కనిపించింది. ఆ బాలిక కుడి కన్ను కూడా పీకేసినట్లుగా తెలుస్తోంది.

స్థానిక బీజేపీ నాయకుడి కూతురిగా బుధాబర్ గ్రామ స్థానికులు గుర్తించారు. స్థానిక స్మశానవాటికలో బుధవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. బీజేపీ లీడర్ కు ఉన్న ఐదుగురు సంతానంలో బాధితురాలు పెద్ద కూతురు. బాలిక పదో తరగతి చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మొబైల్ ఫోన్ రికవరీ చేసి దాని ఆధారంగా ప్రదీప్ కుమార్ సింగ్ ధనుక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రాథమిక నిందితుడైన ధనుక్..కు ఆల్రెడీ పెళ్లి అయిందని పోలీసులు వెల్లడించారు.

బాలిక కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జూన్ 7 ఉదయం 10గంటలకు వెళ్లిన కూతురు తిరిగి రాలేదని చెప్తున్నారు. పంకీ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జి అశోక్ కుమార్.. కూతురు కనిపించడం లేదని ఆ ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చిందనే కేసు విచారణలో ఉండగా స్థానికులకు చెట్టుకు వేలాడుతూ ఉందనే సమాచారాన్ని చెప్పారు.

ఒక గుడ్డతో వేలాడుతూ కుడి వైపు కన్ను లేకుండా కనిపించిందని అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఆమెను నిర్దయగా కొట్టడమే కాకుండా చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరింంచేందుకు దారుణంగా హింసించారు అని సూసైడ్ స్పాట్ స్పష్టం చేస్తుంది.

మెడిని రాయ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లడంతో పోస్టు మార్టం నిర్వహించారు. ఫలితం వచ్చిన తర్వాత రేప్ చేసి మర్డర్ చేశారా అనేది తలుస్తుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి నిజాలు కనుక్కుంటామని అన్నారు. ఇంట్లో గొడవ జరగడంతోనే బయటకు వెళ్లిపోయి ఉండొచ్చని మాటకు కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. అని పోలీసులు అంటున్నారు.