అందుకే..లాక్ డౌన్ పొడిగించండి : గోవా సీఎం 

  • Published By: nagamani ,Published On : May 29, 2020 / 08:59 AM IST
అందుకే..లాక్ డౌన్ పొడిగించండి : గోవా సీఎం 

నాలుగో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు మే 31తో ముగియ‌నున్న క్రమంలో  
మ‌రో 15 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ కోరుతూ..కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. అలాగే..లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ, 50 శాతం రెస్టారెంట్లను తెరుచుకునేందుకు ఐదో విడ‌త లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇవ్వాల‌ని హోంమంత్రితో ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా కోరామని సావంత్ తెలిపారు. 

అలాగే జిమ్‌ల‌ను తెరుచుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని తమకు పలువురి నుంచి వినతులు వస్తున్నాయనీ చెప్పారు. దేశంలో నాలుగు విడ‌త‌లుగా లాక్‌డౌన్ విధించినా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది ఏమాత్రం త‌గ్గ‌ట్లేదని  అందుకే మ‌రో 15 రోజుల‌పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని తాను కేంద్ర హోంమంత్రిని కోరాన‌ని గోవా సీఎం సావంత్ చెప్పారు.   

Read: శ్రామిక్‌ ట్రైన్లలో వారు ప్రయాణించొద్దు: రైల్వేశాఖ