lockdown : ప్రతి సండే లాక్ డౌన్..ఎక్కడెక్కడ

దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

lockdown : ప్రతి సండే లాక్ డౌన్..ఎక్కడెక్కడ

Madhya Pradesh Covid 19

Madhya Pradesh:దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రధానంగా మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా కేసులు అధికంగా ఉండే ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా..ఛింద్వాడా, రత్లామ్, ఖర్గోనాలలో, భైతూల్ ఆదివారం లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని జబల్‌పూర్, ఇండోర్, భోపాల్ లలో ప్రతీ ఆదివారం లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఏడు పట్టాణాల్లో శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ ఉంటుందని వెల్లడించింది. మరోవైపు..రాష్ట్రంలో కొత్తగా 1,712 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,80,298కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఏడుగురు మృతి చెందారు.