Bird flu In Pune : పుణెలో బర్డ్ఫ్లూ..25,000 కోళ్లను చంపేయాలని కలెక్టర్ ఆదేశం
మహారాష్ట్రలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది.పుణెలో బర్డ్ఫ్లూ సోకి కోళ్లు చనిపోయారు.దీంతో 25,000 కోళ్లను చంపేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Bird flu In Pune : మహారాష్ట్రలోని థానేలో జిల్లాలో మరోసారి బర్డ్ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని వెహ్లోలిలో ఉన్న ఓ కోళ్లఫారంలో వంద కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో బర్డ్ ఫ్లూ సోకే కోళ్లు మరణించాయనే అనుమానంతో కోళ్ల నమూనాలను పుణెలోని ల్యాబ్కు పంపించారు.ఈ వైరస్ వ్యాప్తి మరింత చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పశుసంవర్థకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ రాజేష్ జె నర్వేకర్ అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ఫారంలోని కోళ్లను చంపివేయాలని ఆదేశించారు.
వెహ్లోలీకి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుమారు 25 వేల కోళ్లను చంపేయాలని అధికారులకు సూచించారు. వ్యాధిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా పక్షులు చనిపోయాని థానే జెడ్పీ సీఈఓ డా. బహుసాహెబ్ దంగ్డే వెల్లడించారు. బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించినట్లు కేంద్ర పశు సంవర్ధక శాఖకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చనిపోయిన కోళ్ల నమూనాలను సేకరించి పరీక్ష కోసం పూణే ఆధారిత ప్రయోగశాలకు పంపామని తెలిపారు.