రోడ్ యాక్సిడెంట్‌లో గర్భిణీ చిరుత దుర్మరణం

రోడ్ యాక్సిడెంట్‌లో గర్భిణీ చిరుత దుర్మరణం

Road Accident: గుర్తు తెలియని వాహనాలు ఢీకొని గర్భిణీ చిరుత రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. మహారాష్ట్రాలోని థానె జిల్లా మీరా భయాందర్ కాశీమీరా లొకాలిటీలో ఈ ఘటన జరిగింది. ముంబై-అహ్మదాబాద్ హైవేపై శనివారం అర్ధరాత్రి ఈ ఘటన నమోదైంది.

‘ఆదివారం అర్ధరాత్రి 12గంటల 30నిమిషాల సమయంలో ఓ ఆడ చిరుత తీవ్రగాయాల పాలైనట్లు గుర్తించాం. సంజయ్ గాంధీ పార్క్(ఎస్జీఎన్పీ) రెస్క్యూ సెంటర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి వచ్చి చిరుతను తీసుకొచ్చారు.



రాత్రి సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగానే 2గంటల 15నిమిషాల సమయంలో చిరుత చనిపోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం టీం దానికి పోస్టు మార్టం నిర్వహించింది. బలంగా తాకడంతో కండరాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు పలు గాయాలు అయినట్లు గుర్తించారు.

గర్భిణీ చిరుత కడుపులో మూడు పిండాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.