Manipur: 8 గంటల ఆపరేషన్‭లో 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించిన మణిపూర్ సీఎం

ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై తిరుగుబాటుదారులు ఏకకాలంలో దాడి చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ సహా మరిన్ని ప్రాంతాల్లో కాల్పులు జరుగుతున్నాయని, వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి

Manipur: 8 గంటల ఆపరేషన్‭లో 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించిన మణిపూర్ సీఎం

Kuki militants: మణిపూర్‭లో అల్లర్లు లేసిన అనేక ప్రాంతాల్లో పోలీసు కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి సుమారు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం అన్నారు. “ఉగ్రవాదులు పౌరులపై M-16, AK-47 అసాల్ట్ రైఫిల్స్, స్నిపర్ గన్‌లను ఉపయోగిస్తున్నారు. వారు ఇళ్లను తగలబెట్టడానికి చాలా గ్రామాలకు వచ్చారు. మేము సైన్యం సహా ఇతర భద్రతా దళాల సహాయంతో వారిపై చాలా బలమైన చర్య ప్రారంభించాము. దాదాపు 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు మాకు నివేదికలు అందాయి” అని ఎన్ బీరెన్ సింగ్ అన్నారు.

Coffin Remark: పార్లమెంటును శవ పేటికతో పోల్చిన ఆర్జేడీపై విపక్షాల విమర్శలు

అయితే వారిని కుకీ మిలిటెంట్లు అని పిలవనని సీఎం అన్నారు. బదులుగా వారిని కుకీ టెర్రరిస్టులనే అంటానని స్పష్టం చేశారు. వారు నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరుపుతున్నారని మండిపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై తిరుగుబాటుదారులు ఏకకాలంలో దాడి చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ సహా మరిన్ని ప్రాంతాల్లో కాల్పులు జరుగుతున్నాయని, వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) వైద్యులు మాట్లాడుతూ ఫాయెంగ్‌లో జరిగిన కాల్పుల్లో గాయపడిన 10 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఖుమంతెం కెన్నెడీ (27) అనే ఒక రైతు, బిషెన్‌పూర్‌లోని చందోన్‌పోక్పిలో జరిపిన కాల్పుల్లో మరణించాడు. అతని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలిస్తున్నారని, మరింత మంది ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

Lok Sabha Elections 2024: విపక్షాల కీలక నిర్ణయం.. బీజేపీని ఓడించేందుకు వ్యూహం.. భేటీకి ముహూర్తం

హోంమంత్రి అమిత్ షా సోమవారం మణిపూర్‌లో పర్యటించనున్నారు. ప్రశాంతత, శాంతిని కొనసాగించాలని, సాధారణ స్థితిని తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన ఇప్పటికే కుకీలకు విజ్ఞప్తి చేశారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాష్ట్రానికి వెళ్లారు. షెడ్యూల్డ్ తెగల (ST) కేటగిరీలో చేర్చాలన్న మీటీస్ డిమాండ్‌పై ఇంఫాల్ లోయ సహా చుట్టుపక్కల నివసించే మెయిటీలు, కొండల్లో స్థిరపడిన కుకీ తెగల మధ్య కొనసాగుతున్న జాతి హింసలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది. మే 3న ఘర్షణ మొదలైంది. మణిపూర్‌ రాష్ట్రంలో అప్పటి నుంచి (25 రోజులకు పైగా) ఇంటర్నెట్ లేదు.