గర్భస్రావం అయ్యిందని ఒకే తాడుతో దంపతుల ఆత్మహత్య

గర్భస్రావం అయ్యిందని ఒకే తాడుతో దంపతుల ఆత్మహత్య

MP couple suicide In mahabubnagar : పెళ్లి అయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోతే దంపతులు అదో పెద్ద లోటుగా భావిస్తారు. ఎక్కడికన్నా వెళితే..మీకు ఎంత ఆస్తి ఉందని అడగరు…మీకు పిల్లలెంతమందీ? అని అడుగుతారు. పేదలకైనా శ్రీమంతులైనా పిల్లలు ఉండాల్సిందే. అలా పుల్లల కోసం తపించే ఓ జంట ఎట్టకేలకు భార్య కడుపు పండింది.

భార్య గర్భవతి అని తెలిసిన భర్త సంతోషించాడు. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. భార్యకు గర్భస్రావం అయ్యింది. దీంతో ఇద్దరూ తల్లడిల్లిపోయారు. అప్పటి వరకూ వాళ్లకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏమాత్రం బాధపడలేదు. ఇద్దరూ కష్టపడి పానీపూరీ బండి నడుపుకుంటూ హాయిగానే బతికారు. పిల్లలు లేరనే బాధ తప్ప ఆర్థిక సమస్యల గురించి పెద్దగా బాధపడేవారుకాదు. కానీ రాక రాక గర్భం వస్తే అదికాస్తా నిలువకుండాపోయిందనే మనస్తాపంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కుమ్మరి వాడలో మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్‌- కరీనా జంట నివాసం ఉంటున్నారు. బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి మహబూబ్ నగర్ కు వచ్చి ఉంటున్నారు. చిన్న పానీపూరీ బండి నడిపిస్తూ బాగానే ఉంటున్నారు. కానీ పిల్లలు లేరనే బాధ పడేవారు. ఈక్రమంలో గత కొంతకాలంగా కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ తో వ్యాపారం లేదు. లాక్ డౌన్ ముగిసింది.

నెమ్మదిగా పానీపూరీ బండి వ్యాపారం ప్రారంభించారు. కానీ పెద్దగా..వ్యాపారం నడవటంలేదు. దీనికి తోడు..నెల రోజుల క్రితం కరీనాకు అబార్షన్‌ అయింది. దీంతో మనస్తాపం చెందిన రాహుల్‌- కరీనా దంపతులు వారి ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై వనటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలకు ఈ వార్తను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.