మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు – ప్రణబ్ ముఖర్జీ కొడుకు
మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన తిరిగి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుకోవాలని ప్రార్థించాలని సూచించారు.
My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable !
Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News .— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020
ఈ మధ్య ప్రముఖులు, సెలబ్రెటీలు ఆరోగ్యం విషమంగా ఉంటే చాలు కొంతమంది ముందే కోడై కూసేస్తారు. ఫలానా వారు కన్నుమూశారంటూ ప్రచారం చేస్తుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని కాస్తా వైరల్ గా మారిపోతున్నాయి. అయ్యో తాము చనిపోలేదనో సొంతంగా వారే ప్రకటించాల్సి వస్తుంది.
కొన్ని సందర్భాల్లో వారి కుటుంబసభ్యులు ముందుకు వచ్చి తమ వారు బతికే ఉన్నారని చెప్పాల్సి వస్తోంది. ప్రణబ్ ముఖర్జీ విషయంలో కూడా ఇదే జరిగింది. బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడంతో..ఆపరేషన్ చేశారు వైద్యులు. అప్పటి నుంచి వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు.
కానీ..ఒక్కసారిగా..బుధవారం రాత్రి ఆయన మరణించారంటూ..సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పలువురు సంతాపం కూడా తెలియచేశారు. దీంతో ప్రణబ్ కొడుకు అభిజిత్ ముఖర్జీ ముందుకు రావాల్సి వచ్చింది.
అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ప్రణబ్…కొంత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్న 2020, ఆగస్టు 10వ తేదీ సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫర్ హాస్పిటల్ లో చేరారు.
పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రణబ్ సూచించారు.