ఆనాడు మహిళను తన్నిన BJP MLAకు కరోనా

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 07:37 AM IST
ఆనాడు మహిళను తన్నిన BJP MLAకు కరోనా

గుజరాత్ రాష్ట్రంలోని నరోడా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే బలారం తవానీ గుర్తుకున్నారు కదా. ఓ మహిళను తన్నిన అంశం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈయనకు కరోనా వైరస్ సోకింది. బలరాంతో కలుపుకుని గుజరాత్ లో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరుకుంది.

ఈ విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా వెల్లడించారు. జమల్పూర్ ఖడియా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ కేడ్వాలా, నికోల్ బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ పంచల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యే బలరాం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వైద్యులు పరీక్షించగా..కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 వేలకు చేరుకుంది. వీరిలో పది వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 

ఇక బలరాం విషయానికి వస్తే…నీతూ తేజ్ వాణి అనే మహిళపై దాడికి పాల్పడిన వైరల్ అయ్యింది. సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన ఆమెపై ఎమ్మెల్యే బలరాం, ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో దీనిపై ఎ న్నో విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యే తన తప్పును సరిదిద్దుకున్నారు. అవగాహన లోపం వల్లే ఇది జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. నీతూ తేజ్ వాణి కూడా ఎమ్మెల్యేకు రాఖీ కట్టి బలారం తన సోదరుడులాంటి వాడు..ఒకే కుటుంబం అని చెప్పింది. 

Read: జడ్జికి కరోనా..కోర్టులో కలకలం