Fraud: మూలికల ఫార్ములా పేరుతో లేడీ డాక్టర్ కు నైజీరియన్ టోకరా..రూ.41 లక్షలు దోపిడీ

వన మూలికల ఫార్ములా చెబితే రూ.5 కోట్లు ఇస్తానని లేడీ ఆయుర్వేద డాక్టర్ ని నమ్మించిన నైజీరియన్ ఆమె నుంచి రూ.41 లక్షలు దోపిడీ చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించటంతో అన్ని ఆధారాలతో సహా నైజీరియన్ ను హైదరాబాద్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు.

Fraud: మూలికల ఫార్ములా పేరుతో లేడీ డాక్టర్ కు నైజీరియన్ టోకరా..రూ.41 లక్షలు దోపిడీ

Nigerian Cheating

Nigeria man who cheated an women Ayurvedic doctor : గంజాయి అమ్మకాలు అంటే నైజీరియన్స్ ఠక్కున గుర్తుకొస్తారు. అలాగే భారత్ లో జరిగే పలు రకాల మోసాలకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ శాతం నైజీరియన్స్ చేసేవే. ఉపాధి కోసం నైజీరియా నుంచి భారత కొచ్చిన చాలామంది నైజీరియన్స్ మోసాలకు పాల్పడుతు లక్షలు దండుకుంటున్నారు. ఈక్రమంలో ఓ ఆయుర్వేద డాక్టర్ ఓ నైజీరియన్ వలలో పడింది. రూ.41 లక్షలు పోగొట్టుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది.హెర్మల్ ముడిపదార్ధాలు విదేశాలకు ఎగుమతి పేరుతో మోసానికి పాల్పడి సదరు లేడీ డాక్టర్ నుంచి లక్షలు దండుకున్నాడు. మూలికల ఫార్ములా చెబితే రూ.5 కోట్లు ఇస్తానని ఆమెను నమ్మించాడు. అలా ఆమెను నమ్మించి హెర్బల్ ముడిపదార్ధాలు ఎగుమతి చేస్తామని దానికి ట్యాక్స్ కట్టాలని చెప్పి రూ.41లక్షలు కాజేశాడు.

వివరాల్లోకి వెళితే..ఉపాధి కోసం ఓ నైజీరియా నుంచి ఢిల్లీ వచ్చాడు. కానీ సరైన పని దొరకలేదు. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాడు.ఉపాధి దొరకకో లేదా తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించాలనే దురాశతోనే చిన్నాచితక మోసాలకు అలవాటు పడ్డాడు. కరోనా వేళ మంచి డిమాండ్​ ఉన్న ఆయుర్వేద డాక్టర్​ను టార్గెట్​ చేశాడు. మూలికా వైద్యం సూత్రాలు(ఫార్ములా) విక్రయిస్తే రూ. 5కోట్లు ఇస్తానంటూ సదరు లేడీ డాక్టర్ ని నమ్మించాడు. పదిహేను రోజుల పాటు బ్యాంక్ ఖాతాలు, చిరునామాలు పరిశోధించి ఈ నేరానికి పాల్పడింది ఢిల్లీలో ఉంటున్న మెస్సీ డాన్ హోగా గుర్తించారు.
ఇద్దరు పోలీస్ అధికారులు ప్రత్యేకంగా అక్కడికి ఢిల్లీ వెళ్లి మోహన్ గార్డెన్ ఠాణా పరిధిలో నివసిస్తున్న డావ్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 31 ఏటీఎం కార్డులు, 12 బ్యాంక్ పాసుపుస్తకాలు, 13 చెక్కుబుక్కులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం హైదరాబాద్​కు తరలించారు.

స్నేహితులతో కలిసి నేర్చుకుని..
దక్షిణాఫ్రికాకు చెందిన 34 ఏళ్ల మెస్సీడా హో నైజీరియాలో సరైన ఉపాధి అవకాశాలు లేక గత మూడేళ్ల క్రితం వ్యాపార పాస్​పోర్టుతో ఢిల్లీ వచ్చాడు. ఉపాధి అవకాశాలు లభించకపోవటంతో అదే ప్రాంతంలో ఉంటున్న నైజీరియన్లతో స్నేహం చేశాడు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పెళ్లి చేసుకుంటామంటూ మోసాలు చేస్తుండగా గమనించాడు. స్నేహితుల మోసాలకు సహకరించి వేలల్లో సంపాదించాడు. పోలీసులకు అనుమానం రాకుండా సైబర్ మోసాలు చేయటానికి మోహన్ గార్డెన్స్​లో రెండేళ్ల క్రితం ఓ చిన్న బేకరి, కూల్​డ్రింక్స్ షాపు ప్రారంభించాడు.

స్నేహితులతో కలిసి విడిపోయి సంవత్సరం క్రితం నుంచి సొంతంగా మోసాలకు పాల్పడుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, పరికరాలకు గిరాకీ ఉందని గుర్తించి వాటిని తక్కువ ధరలకే తెప్పిస్తానని చెప్పి డాక్టర్లు, ఫార్మా కంపెనీల వారికి ఫోన్లు చేసి నమ్మించాడు. అలా వారి నుంచి రూ. వేలు, రూ.లక్షలు నగదు కాజేశాడు.ఈక్రమంలో మెహదీపట్నంలో ఉంటున్న లేడీ ఆయుర్వేద డాక్టర్ ఆమెకు ఫోన్ చేసిన మెస్సీ తను లండన్​లో ఉంటున్నడాక్టర్ గా పరిచయం చేసుకున్నాడు. మీరు తయారు చేస్తున్న మూలికల ఫార్ములా విక్రయిస్తే రూ. 5 కోట్లు ఇస్తానంటూ నమ్మించాడు. వనమూలికలను పంపిస్తానని వాటిని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు పార్సిల్ పంపిస్తానని చెప్పాడు. వాటికి ఆర్బీఐ, కస్టమ్స్ పేరుతో రూ. 42 లక్షలు కట్టాలని వాటిని పంపిస్తే పార్శిల్స్ మీకు ఇచ్చేస్తారని చెప్పాడు. అలా లేడీ ఆయుర్వేద డాక్టర్ నుంచి రూ.41 లక్షలు తన బ్యాంకుకు ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.

ఆ తరువాత తాను డిల్లీకి తీసుకువచ్చిన పౌండ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని… ఈలోపు తన కూతురు చనిపోయిందంటూ వార్త వచ్చిందని డాక్టర్ కు ప్పాడు. లండన్ వెళ్లేందుకు రూ.20 వేలు కావాలంటూ అడగ్గా.. నిజమేనని నమ్మిన వైద్యురాలు ఆ డబ్బు పంపింది. తరువాత మెస్సీ తన ఫోన్​ స్విచ్ఛాఫ్ చేశాడు.దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించటంతో అన్ని ఆధారాలతో సహా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మెస్సీని తమదైన శైలిలో విచారించారు. పాస్​పోర్ట్​ గడువు పూర్తికావడం వల్ల గతేడాది అక్టోబరులో మోహన్ గార్డెన్ ఠాణా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.