‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ : అరకిలో ప్లాస్టిక్ తెస్తే కడుపు నిండా భోజనం
సోషల్ మీడియాలో అసభ్య పోస్ట్ లు పెడితే అరెస్ట్ చేస్తామని ఏపీ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా కించపరిచేలా..అవమానపరిచేలా పోస్ట్ లు పెడితే వారిని వెంటనే కనిపెట్టి అరెస్ట్ చేస్తామన్నారు. మహిళలపై నేరాలు పెరుగుతున్నాయనీ..దీనిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనీ..నేరాలు పాల్పడినట్లుగా ఆధారాలతో నిరూపణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ అనే ప్రత్యేకమైన ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహార పథకం కింద ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొస్తే కడుపునిండా భోజనం పెడుతున్నారు. దీంతో పేదలకు కడుపునించా ఆహారాన్ని పెట్టటమే కాకుండా పర్యవరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను కూడా సేకరించబడుతోంది.
ఈ సందర్భంగా భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రేమ్ చంద్ర చౌదరి మాట్లాడుతూ..ఆహార భద్రత కలిగిన ఈ ప్లాస్టిక్ను సేకకరణ జరుగుతోందన్నారు. దీంతో ప్లాస్టిక్ సేకరించేవారు పెరిగారని దీంతో ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ కనిపించటంలేదన్నారు. ప్లాస్టిక్ తెస్తే భోజనం పెట్టే కేంద్రాలను 11 ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంతో ప్లాస్టిక్ సేకరించబడుతోంది..అదే సమయంలో కడుపునిండా భోజనం కూడా పెడుతున్నామని అన్నారు. భువనేశ్వర్ నగరంలోని ఈ 11 ఆహార కేంద్రాలలో ఎవరైనా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురావచ్చనీ..అర కిలో ప్లాస్టిక్కు బదులుగా కడుపునించా భోజనం పెడుతున్నామని తెలిపారు.
Odisha: Bhubaneswar Municipal Corporation (BMC) in collaboration with NGOs has rolled out an initiative “Meal for Plastic” under State government’s Ahar Yojana. Prem Chandra Chaudhary, BMC Commissioner says,”This is kind of a plastic collection campaign, plus food security.” pic.twitter.com/kc79AJI922
— ANI (@ANI) December 16, 2019